నల్లగొండ: జిల్లాలో నకిలీ డీజిల్ తయారీ చేస్తున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. నార్కట్పల్లి కేంద్రంగా నకిలీ డీజిల్ తయారు చేసి పెట్రోల్ బంకులకు విక్రయిస్తున్నారు. ఓ ప్రముఖ పెట్రోల్ కంపెనీ అధికారులతో కలిసి ఈ దందాను నడుపుతున్న గుండా సంతోష్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల విచారణ సందర్భంగా చాలా విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ అక్రమ దందా ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు, విజయవాడ నగరాల్లో విస్తరించింది. బడా కాంట్రాక్టర్లు, ట్రాన్స్ పోర్ట్ కంపెనీలు, లారీ డ్రైవర్లకు నకిలీ డీజిల్ను విక్రయిస్తున్నట్టు, 2014 నుంచి ఈ దందాను కొనసాగిస్తున్నారని పోలీసులు గుర్తించారు. నిందితులను త్వరలో మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి