వేసవిలో ఉక్కపోతకు ప్రజలు ఆరుబయట నిద్రిస్తున్నారు. వేసవి సెలవులు కావడంతో చాలా మంది సొంతూర్లకు, విహార యాత్రలు, తీర్థయాత్రలకు వెళ్తున్నారు. ఇదే అదునుగా దొంగలు రెచ్చిపోతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉంటే దొంగతనాలను అరికట్ట వచ్చని పోలీసులు పేర్కొంటున్నారు. ఈ విషయమై గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.
ప్రస్తుతం దొంగతనాలు అధికమవడంతో పోలీసులు కూడా గస్తీ పెంచారు. దాంతో పాటు దొంగల బారి నుంచి కాపాడుకునేందుకు చేపట్టాల్సిన చర్యలపై గ్రామాల్లో మైకుల ద్వారా ప్రచారం చేస్తున్నారు. కళాజాత బృందాల ద్వారా ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.
పోలీసుల సూచనలు
చోరీల నియంత్రణకు చర్యలు
వేసవిలో చోరీల నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నాం. వీధుల్లో ఎవరైనా అనుమానితులు కనిపిస్తే వెంటనే పోలీసులకు తెలుపాలి. వారిని అదుపులోకి తీసుకొని విచారించడం వల్ల దొంగల బారి నుంచి కాపాడే అవకాశం ఉంటుంది. ప్రజలు అప్రమత్తంగా ఉండి పోలీసులకు సహకరిస్తే దొంగతనాలు జరుగకుండా నివారించవచ్చు.
– నవీన్కుమార్, ఎస్ఐ, నేరేడుచర్ల