వలిగొండ జూన్10: మహిళ మృతికి కారణమైన వారిని కఠి నంగా శిక్షించి మృతురాలి కుటుంబానికి న్యాయం చేయాలని కుటుంబ సభ్యులతో కలిసి గ్రామస్తులు ఆందోళన చేసిన ఘ టన మండల పరిధిలోని వెంకటాపురం గ్రామంలో గురువా రం జరిగింది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల ప్ర కారం వెంకటాపురం గ్రామానికి చెందిన మంటిపల్లి మంగ మ్మ ఈనెల 8వ తేదీ మంగళవారం గ్రామ శివారులోని వ్య వసాయ బావిలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. మహిళ మృతికి గ్రామంలోని కొందరు వ్యక్తులు కారణమని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతికి కారణ మైన వ్యక్తులను చట్ట ప్రకారం శిక్షించి మృతురాలి కుటుంబా నికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ, మృతికి కారకులు గా భావిస్తున్న వారి ఇంటి ఎదుట శవాన్ని ఉంచి గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు రామన్నపేట సీఐ రాజు ఆధ్వర్యంలో శాంతి భద్రతలకు వి ఘాతం కలుగకుండా బందోబస్తు చర్యలు చేపట్టి, ఆందోళన చేస్తున్న బాధితులతో చర్చించారు. మహిళ మృతికి కారణమై న వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకొని బాధిత కుటుం బానికి న్యాయం చేస్తామని నచ్చజెప్పి ఆందోళనను విరమిం పజేశారు. గ్రామంలో ఆవాంఛనీయ ఘట నలు చోటు చేసుకోకుండా ఆత్మకూర్ ఎస్సై ఇద్రీస్ ఆలీ, రామన్నపేట ఎస్సై వినోద్, స్థా నిక ఎస్సై రాఘవేందర్గౌడ్ పోలీస్ సిబ్బం దితో బందోబస్తు నిర్వహించారు.