మున్సిపల్ చైర్పర్సన్ ఎరుకల సుధ
యాదాద్రి, జూన్10: మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక కాంగ్రెస్ కౌన్సిలర్లు అభివృద్ధికి అడ్డు పడుతున్నారని యాదగిరిగుట్ట మున్సిపల్ చైర్ పర్సన్ ఎరుకల సుధ ఆరోపించారు. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్, స్థానిక ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్రెడ్డి సహకారంతో యాదగిరిగుట్ట మున్సిపాలిటీ పరిధిలో రూ. 20 కోట్లతో అభి వృద్ధికి అంకురార్పణ జరిగిందన్నారు. టీయూఎఫ్ఐడీసీ (తె లంగాణ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్) పథకం కింద రూ. 20 కోట్లు మంజూరు కాగా.. రూ.15 కోట్ల విలువ గల డ్రైనేజీలు, సీసీ రోడ్ల, పనులు చేపట్టామని అన్నా రు. గురువారం యాదగిరిగుట్ట పట్టణంలోని గొంగిడి నిలయం లో ఆమె మీడియాతో మాట్లాడారు. గత 40 ఏండ్లుగా పట్టణం లో ఎన్నో మౌలిక సమస్యలు పరిష్కారం కాకుండా ఉన్నాయ ని, ప్రధానంగా పట్టణంలో నల్ల చెరువు నుంచి వెళ్లే కాలువ నీళ్లు ఎక్కడికక్కడ నిలిచి దుర్గంధ పూరితంగా మారిందన్నారు.
గత కాంగ్రెస్ పాలకుల హయాంలో నిరాదరణకు గురైన నల్ల చెరువు ప్రధాన కాలువను రూ.5.85కోట్లు వెచ్చించి చెరువు నుంచి బీసీ కాలనీ వరకు పునరుద్ధరణతో పాటు కాలువకు రిటైనింగ్ వాల్, రోడ్డుకు కల్వర్టు పనులు నాణ్యతతో జరుగుతు న్నాయన్నారు. నూతనంగా ఏర్పాటైన యాదగిరిగుట్ట మున్సి పాలిటీ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని అన్నారు. కమీషన్లకు ఆశ పడి గతంలో నిర్మించిన సీసీ రోడ్లు అధ్వాన్నంగా మారాయ న్నారు. పట్టణంలోని ప్రతి వీధిలో పటిష్టమైన మురికి కాలువ లు, అంతర్గత రోడ్ల నిర్మాణం చేపట్టామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పం గొప్పదని యాదాద్రిని ప్రపంచ పటంలో నిలిపారని తెలిపారు. యాదాద్రి అభివృద్ధికి రూ. 2000 కోట్ల నిధులు మంజూరు చేయగా అభివృద్ధి కండ్ల ముందే కనబడు తున్నదన్నారు. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం, పట్టణ అభివృద్ధి జరిగితే తమ ఉనికే ప్రమాదమన్న భయంతో కాంగ్రెస్ నాయకులు అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నా రన్నారు. కార్యక్రమంలో రైతు బంధు సమితి జిల్లా డైరెక్టర్ మి ట్ట వెంకటయ్య, టీఆర్ఎస్ నాయకులు కసావు శ్రీనివాస్గౌడ్, పల్లెపాటి బాలయ్య, అంకం నర్సింహ, కీసరి బాలరాజు, గోప గాని గోపాల్గౌడ్, ఎరుకల హేమేందర్గౌడ్, గుండ్లపల్లి లింగం గౌడ్ తదితరులు పాల్గొన్నారు.