నల్లగొండ ప్రతినిధి, (నమస్తే తెలంగాణ): కేంద్ర మంత్రి కిషన్రెడ్డి తెలుగు రాష్ర్టాల నదీ జలాల సమస్యకు మధ్యవర్తిత్వం వహిస్తాననడాన్ని స్వాగతిస్తామని, అయితే అంతకంటే ముందే ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం రాష్ర్టానికి దక్కాల్సిన వాటాపై, హామీల గురించి కేంద్రాన్ని నిలదీయాలని శాసనమండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని డిమాండ్ చేశారు. ఈ మేరకు నల్లగొండలోని తన నివాసంలో సోమవారం గుత్తా సుఖేందర్రెడ్డి మీడియా సమావే శంలో మాట్లాడారు. పునర్విభజన చట్టంలోని హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు.
మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఏడు మండలాలతో పాటు సీలేరు ప్రాజెక్టును ఆంధ్రలో ఏక పక్షంగా, అప్రజా స్వామికంగా కలిపేసారని గుర్తు చేశారు. ఇప్పుడు వాటిని తిరిగి తెలంగాణకు తీసుకురాగాలరా? మీకు ఆ శక్తి ఉందా? అని కిషన్రెడ్డిని సూటిగా ప్రశ్నించారు. 2010లో యూపీఏ హాయంలో వరంగల్కు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ మంజూ రైందని, దాన్ని పూర్తి చేస్తామని బీజేపీ నేతలు చెప్పారన్నారు.
కానీ 2014లో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కేంద్రం దాని ఊసే ఎత్తడం లేదన్నారు. కానీ 2018లో మహారాష్ట్ర లాతూర్కు రైల్వే కోచ్ ప్యాక్టరినీ తరలించి, శరవేగంగా పనులు చేస్తున్నది నిజం కాదా అని ప్రశ్నించారు. ఇప్పడు ఆ కోచ్ ఫ్యాక్టరీని వరంగల్కు తీసుకువచ్చి కేంద్రమంత్రిగా కిషన్రెడ్డి తన శక్తిసామర్ధ్యాలను నిరూపించుకోవాలని సవాలు చేశారు.
కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ఎఫ్సీఐ రబీ వరిధాన్యాన్ని కొనుగోలు చేయబోమని, 60లక్షల టన్నులు మాత్రమే కొనుగోలు చేస్తామని చెబుతుందన్నారు. దీంతో రాష్ట్ర రైతాంగంపై తీవ్ర ప్రభావం పడనుందని, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆందోళన చెం దుతుందన్నారు.
కానీ కేంద్ర మంత్రి కిషన్రెడ్డి రాష్ట్రంలో పండే ప్రతీ గింజను కొనుగోలు చేయిస్తానని కేంద్రంతో చెప్పించ గలరా అని ప్రశ్నిం చారు. మీకు ఆ శక్తి ఉంటే రైతుల ఆందోళనకు పరిష్కారం చూపించాలని కోరారు. వీటన్నింటిపై కేంద్రమంత్రి కిషన్రెడ్డి, కేంద్రాన్ని ప్రశ్నిస్తూ సాధించుకోస్తే నదీజలాల సమస్యలో మధ్యవర్తిత్వం వహిస్తానంటే బాగుంటుందని గుత్తా హితువు పలికారు.
బీజేపీ జాతీయవాదం పచ్చిబూటకం
బీజేపీ నేతలు చెబుతున్న జాతీయవాదం, సిద్దాంతమంతా పచ్చి బూటకమని గుత్తా సుఖేందర్రెడ్డి తీవ్రంగా స్పందించా రు. కేవలం అధికారం నిల బెట్టుకోవడం కోసమే ప్రజల మధ్య చిచ్చు పెడుతూ పబ్బం గడుపుతున్నారని ఆరోపించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో కేంద్రంలోని బీజేపీ పూర్తిగా వైఫల్యం చెందిందని ఆరోపించారు. అందుకే కాంగ్రెస్ మాదిరిగా రాష్ర్టాల సీఎంను మార్చే సంస్కృతిని బీజేపీ కొనసాగిస్తున్నదన్నారు.
గుజరాత్లో తాజాగా సీఎంను మార్చడం, ఉత్తరాఖండ్లో ముగ్గురు సీఎంలను మార్చడం లాంటివన్నీ వైఫల్యాల కిందే లెక్క అన్నారు. 2024లో కేంద్రంలో అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదని, ఈ విషయాన్ని ప్రజలే చెబుతున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలే అందుకు కారణమని విమర్శించారు. ఒక్కో ప్రభుత్వ రంగ సంస్థను ప్రైవేటీకరణ చేస్తూ అంబానీ, అదానీలకు అప్పజెప్పుతున్నది నిజం కాదా అన్నారు.
ఎల్ఐసీ అమ్మడం లేదని కిషన్రెడ్డి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఎల్ఐసీ, బీఎస్ఎన్ఎల్, వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ ఇలా ఏదీ మిగిలే పరిస్థితి లేదన్నారు. నల్ల వ్యవసాయ చట్టాలతో రైతాంగాన్ని ముంచుతున్నారని, పెట్రోల్, డీజీల్, గ్యాస్ ధరలను పెంచుతూ ప్రజలపై విపరీతమైన భారం మోపుతున్నారని విమర్శించారు. ప్రజా సమస్యలను బీజేపీ నేతలు మర్చిపోయారని, పునర్విభజన చట్టంంలో రాష్టానికి రావాల్సిన వాటను పక్కన పెట్టారని ఆరోపించారు.
అసెంబ్లీ నియోజకవర్గాల పెంపు ఇక్కడ సాధ్యం కాకుండా కాశ్మీర్లో ఎలా సాధ్యమైందని ప్రశ్నించారు. రాష్ట్రంలో గిరిజన యూనివర్సిటీని ఏర్పాటు చేయగలరా అన్నారు. రాష్ట్రంపై పూర్తి వివక్షను ప్రదర్శిస్తున్న మోడీ ప్రభుత్వం తాజాగా గోదా వరి, కృష్ణా నదులపై పెత్తనాన్ని లాక్కున్న విషయాన్ని గుర్తు చేశారు. అసలు ఈ నదీ జలాల సమస్యకు పరిష్కారం చూసే శక్తి బీజేపీకి ఉందా అని ప్రశ్నించారు. కేవలం అధికార దుగ్ధతో వ్యవహారిస్తున్న బీజేపీ నేతలను, వారి మాటలను రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితి లేదని గుత్తా స్పష్టం చేశారు.
బండి సంజయ్ది నోరా? మోరా?
రాష్ట్ర హైకోర్టు గణేశ్ నిమజ్జనం హుస్సేన్సాగర్లో వద్దని ఉత్తర్వులు ఇస్తే దానికి వ్యతిరేకంగా తాము అందులోనే చేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడడం సమంజసమేనా అన్నారు. అధికార దాహంతో మత కల్లోలాలు సృ ష్టించే లక్ష్యంతో నోటికి ఏదీ వస్తే అది మాట్లాడుతున్న బండి సంజయ్ది నోరా? మోరీనా? అని ప్రశ్నించారు. ఓట్ల రాజకీ యంతో రాష్ర్టాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న కేసీఆర్పై విరుచుకుపడడం తప్ప బీజేపీ నేతలకు మరో ఏజెండానే లేదని ఎద్దేవా చేశారు.
సంజయ్ మాటలకు అంతూపొంతూ ఉండదని, కేవలం హిందూ, ముస్లిం, క్రైస్తవులు మధ్య చిచ్చు పెట్టి లబ్ధి పొందాలన్న కుట్రతోనే మాట్లాడుతున్నాడన్నారు. అసలు ప్రజాస్వామ్య వ్యవస్థలోనే ఓ జాతీయ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పార్టీని నడిపే విధానం ఇదేనా అని ప్రశ్నించారు. 2023లో రాష్ట్రంలో మాదే అధికారమంటూ కిషన్రెడ్డి, బండి సంజయ్లు చెరో వైపు ఊదర గొడుతున్నారని, వీరికి చేతలు లేవని, కేవలం మాటలతోనే కోటలు దాటేస్తున్నారని గుత్తా సుఖేందర్రెడ్డి ఎద్దేవా చేశారు.