నల్లగొండ: కొవిడ్ వైరస్ నేపధ్యంలో వ్యాక్సినేషన్ అందరికీ వేయటానికి సూక్ష్మ ప్రణాళిక సిద్ధం చేసినట్టు కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ తెలిపారు. కొవిడ్ నేపధ్యంలో వ్యాక్సినేషన్ వేగవంతం చేయాలని హైదరాబాద్ నుంచి సీఎస్ సోమేశ్ కుమా ర్, వరంగల్ నుంచి గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావులు బుధవారం ఆయా జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ వారితో మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాలు, సబ్ సెంటర్ల వారిగా వ్యాక్సినేషన్ చేసేం దుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. జిల్లాలో వంద శాతం వాక్సినేషన్ పూర్తి చేసేందుకు స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో పాటు మిగిలిన వారి సహకారం కోరి సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు.
జిల్లా స్థాయిలో వ్యాక్సినేషన్లో ఎదురయ్యే సమస్యలను ఎదుర్కోవటానికి ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వ్యాక్సినేషన్ వంద శాతం పూర్తి చేసిన వారికి ప్రసం సాపత్రం ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. కాన్ఫరె న్సులో అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ, జడ్పీ సీఈవో వీర బ్రహ్మచారి, డీఎంహెచ్వో కొండల్ రావు, డీపీవో విష్ణువర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.