రామగిరి: ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి అన్నారు. నల్లగొండలోని లక్ష్మీగార్డెన్స్లో ఆదివారం నిర్వహించిన పీఆర్టీయూ టీఎస్ జిల్లా సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కేవలం ఉపాధ్యాయులకే కాకుండా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ఉద్యోగులు, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ సిబ్బందికి 30శాతం పీఆర్సీని అందించిన ఘనత సీఎం కేసీఆర్ ప్రభుత్వానిదేన్నారు.
ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 58నుంచి 61కి పెంచుతూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు.
రాష్ట్రంలో అతిపెద్ద ఉపాధ్యాయ సంఘం పీఆర్టీయూటీఎస్ అన్నారు. మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికై ఎన్నో జీవోలను సీఎం కేసీఆర్ను ఒప్పించి తెచ్చామన్నారు.
ఉపాధ్యాయుల లోకల్ క్యాడర్ గుర్తింపు జీవోను జారీ చేయడం ద్వారా ఉపాధ్యాయుల ఉమ్మడి సర్వీస్ రూల్స్ అమలుకు మార్గం సుగమమైందని అందుకు సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు.డీఎస్సీ 2003 ఉపాధ్యాయులకు పాతపెన్షన్, మోడల్ స్కూల్స్, కేజీబీపీ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కూడా జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
అనంతరం పీఆర్పీయూ టీఎస్ నల్లగొండ జిల్లా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎనుకున్నారు. జిల్లా అధ్యక్షుడు సుంకరి భిక్షంగౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో డీఈవో బి.భిక్షపతి, మున్సిపాల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, పీఆర్టీయూ ప్రధాన కార్యదర్శి ముదిరెడ్డి నిరంజన్రెడ్డి, జిల్లా గౌరవాధ్యక్షుడు ఓరుగంటి శ్రీనివాస్, మోడల్ స్కూల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు తరాల జగదీశ్, నాయకులు బసిరెడ్డి రవీందర్రెడ్డి, తరాల పరమేశ్యాదవ్, అద్దంకి సునీల్, వీరమళ్ల శ్రీనివాస్, ఫణికుమార్, వివిధ మండలా భాద్యులు, రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు.