రామగిరి, జూలై 26 : వంద మాటలు చేయలేని పనిని ఒక్క పాట చేస్తుందని ప్రముఖ సాహితీవేత్త, రచయిత సుంకిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. దశాబ్దాల చరిత్ర గల నల్లగొండలోని నాగార్జున ప్రభుత్వ కళాశాలపై అదే కాలేజీలో తెలుగు విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న తండు కృష్ణకౌండిన్య రచించిన ‘నాగార్జున కళాశాల పాట’ను సోమవారం కళాశాలలో నిర్వహించిన సమావేశంలో ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ శ్రోతల హృదయాలను తాకే శక్తి పాటకే ఉంటుందని, అలాంటి అద్భుతమైన పాటను ఎన్జీ కళాశాలపై రాయడం అభినందనీయమని అన్నారు. కళాశాలపై రచించిన పాట చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతుందని విశ్రాంత ఐఏఎస్ చొల్లేటి ప్రభాకర్ పేర్కొన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ చంద్రశేఖర్, పాట రచయిత తండు కృష్ణకౌండిన్య, పూర్వ విద్యార్థులు జి.లింగయ్య, ఎంజీయూ విశ్రాంత రిజిస్ట్రార్ కె.నరేందర్రెడ్డి, ఎదుళ్ల అంజిరెడ్డి, పాట సంగీత దర్శకుడు డేవిడ్కింగ్, గాయకుడు ఆదిమళ్ల మధు, అధ్యాపకులు పాల్గొన్నారు.