రామగిరి, జూలై 24 : మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా నల్లగొండ జిల్లా రైస్మిల్లర్స్ అసోసియేషన్ పిలుపుమేరకు రామ్లక్ష్మణ్ పార్బాయిల్డ్ మిల్లు ఆధ్వర్యంలో నల్లగొండ గడియారం సెంటర్లో అన్నదానం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ జిల్లా ఇన్చార్జి తక్కెళ్లపల్లి రవీందర్రావు, మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి హాజరై ప్రారంభించారు. కార్యక్రమంలో నల్లగొండ జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు చిట్టిపోలు యాదగిరి, జనరల్ సెక్రటరీ రేపాల భద్రాద్రిరాములు, గౌరవాధ్యక్షుడు కందుకూరి మహేందర్, నల్లగొండ సెంటర్ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కమతం నారాయణ, గౌరవాధ్యక్షుడు కొత్త విశ్వనాథం, చిట్యాల అధ్యక్షుడు హనుమంత్, కార్యదర్శి పోల పెద్దయ్య, హాలియా జనరల్ సెక్రటరీ పెలపుడి బాలకృష్ణ, మిల్లర్స్ జూలకంటి ఇంద్రారెడ్డి, పందరి శ్రీనివాస్, యాదా ఈదయ్య, తోనుపునూరి వెంకటేశ్వర్లు, వనామా శ్రీనివాస్, తేలకుంట్ల శ్రీనివాస్, చిత్తనూరి పవన్కుమార్, పురుషోత్తం పాల్గొన్నారు. అంతకముందు జిల్లా కేంద్రంలోని వీటీ కాలనీలోని క్యాంపు కార్యాలయంలో కేట్ చేసిన అనంతరం ముక్కోటి వృక్షార్చనలో భాగంగా ఎస్ఎల్బీసీలో పెద్ద ఎత్తున మొక్కలు నాటారు. అనంతరం జీకే అన్నారం రోడ్డులోని అటవీ శాఖ భూమిలో మొక్కలు నాటారు. ఎమ్మెల్యే కంచర్ల మాట్లాడుతూ ఐటీ, మున్సిపల్ మంత్రి కేటీఆర్ మంచి విజన్ ఉన్న నాయకుడని అన్నారు.