నీలగిరి, జూలై 6 : నల్లగొండ పట్టణంలోని పాతబస్తీ ప్రాంతాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేసి గోల్డ్ సిటీగా మారుస్తానని నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి అన్నారు. మంగళవారం పట్టణంలోని 12, 27, 28, 29, 30, 31, 32, 33, 34వ వార్డుల్లో ఎల్ఆర్ఎస్ నిధుల ద్వారా మంజూరైన పనులకు మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పాతబస్తీ ప్రాంతం గత పాలకుల నిర్లక్ష్యం వల్ల వెనుకబడిందన్నారు. తానే ప్రత్యేక చొరవతో రెండో పైపులైన్ వేయించి ఆ ప్రాంతవాసులకు పుష్కలంగా నీరు అందిస్తున్నట్లు తెలిపారు. పాతబస్తీకి అదనంగా రూ.50 లక్షల నిధులు మంజూరు చేయించి అభివృద్ధి చేస్తానన్నారు. హిందూపూర్ వైకుంఠధామాన్ని ప్రత్యేకంగా రూ.2 కోట్లతో అభివృద్ధి చేయనున్నట్లు పేర్కొన్నారు. ఆయా కార్యక్రమాల్లో వైస్ చైర్మన్ అబ్బగోని రమేశ్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు పిల్లి రామరాజుయాదవ్, కౌన్సిలర్లు అభిమన్యు శ్రీనివాస్, వట్టిపల్లి శ్రీనివాస్, మారగోని నవీన్, ఆలకుంట్ల రాజేశ్వరీమోహన్బాబు, ఈఈ శ్రీనివాస్, టీపీఓ నాగిరెడ్డి, డీఈ వెంకన్న, అంగన్వాడీ టీచర్లు ప్రమీల, కౌసర్, సరస్వతి పాల్గొన్నారు.
కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ
నల్లగొండ రూరల్ : పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే భూపాల్రెడ్డి తిప్పర్తి మండలానికి చెందిన 18మందికి కల్యాణలక్ష్మి చెక్కులను అందించారు. తిప్పర్తి ఎంపీపీ విజయలక్ష్మి, లింగారావు, మార్కెట్ కమిటీ చైర్మన్ సుధాకర్, తాసీల్దార్ కృష్ణయ్య, పాశం సంపత్రెడ్డి, ఎంపీటీసీలు, సర్పంచులు పాల్గొన్నారు.