నల్లగొండ: అనారోగ్యంతో హైదరాబాద్లోని నిమ్స్ దవాఖానలో చికిత్స పొందుతున్న నల్లగొండ మర్రిగూడకు చెందిన నల్లబోతు మారయ్య కుటుంబానికి స్థానిక ఎమ్మెల్యే సోమవారం తన నివాసంలో రూ.3లక్షల ఎల్వోసీ అందజేశారు. కార్యక్రమంలో కౌన్సిలర్ ఊట్కూరి వెంకటరెడ్డి, దాసరి జానయ్య తదితరులు పాల్గొన్నారు.