నల్లగొండ, ఏప్రిల్ 27: తెలంగాణ రాష్ట్ర సమితి 20ఏండ్లలో ఎంతో కీర్తి ప్రతిష్టలను సంపాదించిందని జిల్లా పరిషత్ చైర్మన్ బండ నరేందర్రెడ్డి అన్నారు. నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డితో కలిసి బుధవారం క్యాంపు కార్యాలయంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఉద్యమ నేత కేసీఆర్ రాష్ట్ర సాధనే లక్ష్యంగా ఎన్నో పదవులను తృణప్రాయంగా వదిలేశారని, ఆయన చేసిన త్యాగాల ఫలితమే రాష్ర ఆవిర్భావానికి మూలమని పేర్కొన్నారు. ఎమ్మెల్యే భూపాల్రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర సాధనతో పాటు అభివృద్ధి, సంక్షేమంలో నంబర్ వన్గా నిలబెట్టిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ బొర్ర సుధాకర్, ఐసీడీఎస్ ఆర్ఓ మాలె శరణ్యారెడ్డి, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు పిల్లి రామరాజు, బోనగిరి దేవేందర్, కటికం సత్తయ్యగౌడ్, ఫరీదుద్దీన్, మైనం శ్రీనివాస్, సింగం లక్ష్మి, రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు.
నకిరేకల్లో..
టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ వేడుకలను మంగళవారం నకిరేకల్ పట్టణంలో నిరాడంబరంగా నిర్వహించారు. ఎమ్మెల్యే చిరుమరి లింగయ్య పార్టీ జెండాను ఆవిష్కరించి మాట్లాడారు. అమరవీరుల త్యాగం వృథా కాలేదన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తక్కెళ్లపల్లి రవీందర్రావు, మార్కెట్ కమిటీ చైర్మన్ నడికుడి ఉమారాణీవెంకటేశ్వర్లు, జడ్పీటీసీ మాద ధనలక్ష్మీనగేశ్, తరాల బలరాములు, చింతల సోమన్న టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.