కనగల్, మే 24 : గ్రామాల్లో కరోనా మహమ్మారిన తరిమేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న ది. అందులో భాగంగా ప్రతి వీధిలో సోడియం హైపోక్లోరైట్ పిచికారీ చేస్తూ కొవిడ్ నియంత్రణకు కృషి చేస్తున్నది. కనగల్ మండలం కురంపల్లిలో సర్పంచ్ తలారి కరుణాశ్రీరవీందర్ ఆధ్వర్యంలో గ్రామంలో పంచాయతీ సిబ్బందితో సోమవారం సోడియం హైపోక్లోరైట్ను పిచికారీ చేయించారు.
మర్రిగూడ: మండలంలోని కొట్టాలలో సర్పంచ్ గంట కవితాయాదయ్య బ్లీచింగ్ పౌడర్ చల్లించి, సోడియం హైపోక్లోరైట్ను పిచికారీ చేయించారు. మురుగు కాల్వల్ల్లో చెత్త వేయకుండా గ్రా మంలోని వీధులను శుభ్రంగా ఉంచుకోవాలని స ర్పంచ్ కోరారు. సర్పంచ్ బుర్ర శేఖర్, సిబ్బంది పాల్గొన్నారు.
మామిడాలలో ఐసొలేషన్ కేంద్రం ప్రారంభం
తిప్పర్తి : మండలంలోని మామిడాల గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో కరోనా రోగుల కోసం ఐసొలేషన్ కేంద్రాన్ని మండల వైద్యాధికారి అనూష సర్పంచ్ నాగరాణీఅంబేద్కర్ సహకారంతో కలిసి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామంలో కరోనా బారిన పడిన వారికోసం ఈ ఐసొలేషన్ కేంద్రాన్ని ప్రారంభించినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీటీసీ సిరివెన్నెల ఈదయ్య, వార్డు సభ్యులు గోనె కరుణాకర్, కార్యదర్శి వెంకటేశం, సిబ్బంది నామా వెంకన్న, సాయిలు,బుజ్జమ్మ పాల్గొన్నారు
వైశ్యుల సేవలు అభినందనీయం : డీఎస్పీ
నీలగిరి : సమాజ అభ్యున్నతిలో వైశ్యుల సేవలు అభినందనీయమని నల్లగొండ డీఎస్పీ వెంకటేశ్వర్రెడ్డి అన్నారు. సోమవారం వాసవీక్లబ్ అష్టలక్ష్మి గోల్డెన్ స్టార్ కేసీజీఎఫ్ ఆధ్వర్యంలో గుండా రమేశ్బాబు-గంగా భవానీ వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఆయన కుమారుడు భార్గవ్ సహకారంతో లాక్డౌన్లో విధులు నిర్వహిస్తున్న పోలీసులకు భోజన వితరణ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ వైశ్యులు సేవా కార్యక్రమాల నిర్వహణలో ఎల్లప్పుడు ముందుంటారన్నారు. కార్యక్రమంలో గుండా రమేశ్బాబు, పారేపల్లి శ్రీనివాస్, కోటగిరి రామకృష్ణ, తేలుకుంట్ల శ్రీకాంత్, టూటౌన్ సీఐ చంద్రశేఖర్రెడ్డి, ట్రాఫిక్ సీఐ దుబ్బ అనిల్కుమార్, టూటౌన్ ఎస్ఐ నర్సింహులు పాల్గొన్నారు
పోలీసులకు భోజనాలు
మునుగోడు: లాక్డౌన్లో అలుపెరగకుండా పనిచేస్తున్న పోలీసులకు స్థానిక పండ్ల బండి వ్యాపారి సైదులు సోమవారం భోజన వసతి కల్పించారు. ఈ సందర్భంగా ఎస్ఐ రజనీకర్ మాట్లాడుతూ చిరు వ్యాపారి అయినప్పటికీ సైదులు తన వంతుగా సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో ఏఎస్ఐ యాదగిరి, సులేమాన్, నరేశ్, అశోక్ పాల్గొన్నారు.
కరోనాతో మృతిచెందిన యువకుడికి అంత్యక్రియలు
కట్టంగూర్ : మండలంలోని ముత్యాలమ్మగూడెంకు చెందిన యువకుడు కరోనాతో మృతి చెందాడు. జడ్పీటీసీ తరాల బలరాములు తన సొంత ఖర్చులతో అంత్యక్రియలు జరిపించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆర్థికసాయం అందజేశారు. ఆయన వెంట టీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.