దేవరకొండ, మే 24 : లాక్డౌన్ నిబంధనలు పాటించని వారిపై డ్రోన్ కెమెరా ద్వారా నిఘా పెట్టనున్నట్లు డీఎస్పీ ఆనంద్రెడ్డి అన్నారు. సోమవారం పట్టణంలోని మీనాక్షి సెంటర్లో డ్రోన్ కెమెరా పనితీరును ఆయన పరిశీలించారు. డ్రోన్ కెమెరా 500 మీటర్ల ఎత్తులో ఉండి కిలోమీటరు వరకు పరిస్థితులను సులభంగా గుర్తించగలదన్నారు. లాక్డౌన్ సంపూర్ణంగా పాటిస్తే కరోనా మహమ్మారి నుంచి బయట పడవచ్చన్నారు. ఇప్పటి వరకు నిబంధనలు పాటించని వారిపై డివిజన్ స్థాయిలో 1000 కేసులు నమోదు చేసినట్లు, 350 వాహనాలు సీజ్ చేసినట్లు తెలిపారు. లాక్డౌన్ సడలింపు సమయంలోనే పనులు పూర్తి చేసుకుని ఆ తర్వాత ఇండ్ల నుంచి బయటికి రావద్దని సూచించారు. ఆయన వెంట సీఐ ఆదిరెడ్డి, ఎస్ఐ నారాయణరెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.
కరోనా కట్టడికి సహకరించాలి
మిర్యాలగూడ టౌన్ : కరోనా కట్టడికి ప్రజలు సహకరించాలని మిర్యాలగూడ డీఎస్పీ వెంకటేశ్వర్రావు కోరారు. సోమవారం లాక్డౌన్ అమలులో భాగంగా పట్టణంలో డ్రోన్ కెమెరాతో బందోబస్తును ఆయన పర్యవేక్షించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. సీఐలు సదా నాగరాజు, శ్రీనివాస్రెడ్డి పాల్గొన్నారు.
కట్టుదిట్టంగా లాక్డౌన్ అమలు
హాలియా : లాక్డౌన్ను హాలియాలో పోలీసులు కట్టుదిట్టంగా అమలు చేస్తున్నారు. సోమవారం ఉదయం 10 గంటల తర్వాత రోడ్డుపై తిరిగే వాహనదారులకు ఎస్ఐ శివకుమార్ కన్సెలింగ్ ఇచ్చారు. నిబంధనలు పాటించకుంటే కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. లాక్డౌన్ అమలుతో హాలియా ప్రధాన రహదారి నిర్మానుష్యంగా మారింది.
11బైక్లు సీజ్
తిరుమలగిరి సాగర్ : మండలంలో లాక్డౌన్ కఠినంగా అమలు చేస్తున్నట్లు ఎస్ఐ కె.సుధాకర్ తెలిపారు. మండలంలోని అల్వాల గ్రామంలో సోమవారం లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన దుకాణాదారుడిపై కేసు నమోదు చేసినట్లు, అనవసరంగా రోడ్డుమీదికి వచ్చిన 11 బైక్లను సీజ్ చేసినట్లు చెప్పారు. కరోనా కట్టడికి ప్రభ్వుం ప్రకటించిన లాక్డౌన్ అమలు చేసేందుకు సహకరించాలని ఆయన కోరారు.