నీలగిరి, మే 22 : పట్టణంలో ఓ హిందువు మృతదేహానికి సంప్రదాయ ప్రకారం ముస్లిం యువకులు అంత్యక్రియలు చేసి మానవత్వాన్ని చాటారు. పట్టణానికి చెందిన సింగం అబ్బయ్య భార్య చంద్రమ్మ చనిపోవడంతో ఆమె తరఫున బంధువులు ఎవరూ అంత్యక్రియలు చేయడానికి ముందుకు రాలేదు. దీంతో 26వ వార్డు కౌన్సిలర్ ఆసీమా సుల్తానాబషీరొద్దీన్ ఆధ్వర్యంలో ముస్లిం యువకులు ముందుకొచ్చి వన్టౌన్ సీఐ సురేశ్కుమార్, మున్సిపల్ సిబ్బంది సహకారంతో హిందూ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు పూర్తిచేశారు.