కట్టంగూర్, మే 21 : కరోనా కట్టడి చేసేందుకు అన్ని గ్రామాల ప్రజాప్రతినిధులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. కట్టంగూర్ మండలం పామనుగుండ్ల, ఇస్మాయిల్పల్లి, కల్మెర, మునుకుంట్ల, కురుమర్తి, అయిటిపాముల, ఈదులూరు, ఎరసానిగూడెం, పరడ, నారెగూడెం, నల్లకుంటబోలు సర్పంచులు శుక్రవారం పంచాయతీ సిబ్బందితో గ్రామ వీధుల్లో సోడియం హైపోక్లోరైట్ ద్రావణం పిచికారీ చేయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ప్రతిఒక్కరూ మాస్కులు ధరించి, భౌతికదూరం పాటించాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచులు, ఎంపీటీసీలు వడ్డె సైదిరెడ్డి, పుట్ట సుజన, గుర్రం సైదులు, బెజవాడ సరోజన, గడుసు అనిత, పిన్నపురెడ్డి నర్సిరెడ్డి, సిరిగిరెడ్డి వినోద, కురమిల్ల పూలమ్మ, బీరెల్లి రాజ్యలక్ష్మి పాల్గొన్నారు.
కరోనా పేషెంట్లకు సరుకులు పంపిణీ
శాలిగౌరారం/ కనగల్/ మర్రిగూడ/ చిట్యాల : శాలిగౌరారం మండలం వంగమర్తి, పెర్కకొండారం గ్రామాల్లో కరోనా బాధితులకు రైతుబంధు సమితి మండల కన్వీనర్ గురజాల సర్పంచ్ గుండా శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు, గుడ్లు, రేషన్ బియ్యం పంపిణీ చేశారు. టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు వెంకన్నగౌడ్, కట్టా వెంకట్రెడ్డి, మురళి, సర్వయ్య, యాదగిరి, కృష్ణమూర్తి, అనిత, రమేశ్, వెంకన్న పాల్గొన్నారు. కనగల్ మండలం దోరెపల్లి గ్రామంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు, సర్పంచ్ అయితగోని యాదయ్యగౌడ్, ఉపసర్పంచ్ దాసరి వెంకన్న మాస్కులు పంపిణీ చేశారు. పంచాయతీ కార్యదర్శి చిట్టయ్య ఉన్నారు. మర్రిగూడ మండలంలోని ఖుదాభక్ష్పల్లి పంచాయతీ పరిధి సాయిబండా తండాకు చెందిన జటావత్ పాండు ఇటీవల మృతి చెందాడు. సర్పంచ్ ఆంబోతు సుధాకర్నాయక్ పాండు కుటుంబానికి రూ.10 వేలు, 50కిలోల బియ్యం, నిత్యావసర సరుకులు అందించారు. ఆయన వెంట నాయక్ యూత్ సభ్యులు కొర్ర శ్రీను, అశోక్ ఉన్నారు. చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని 7,8వ వార్డులకు చెందిన కరోనా బాధిత కుటుంబాలకు మానవ హక్కుల పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఆ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పి.మౌనిక, రాష్ట్ర బాధ్యుడు మేడి నరేశ్, కార్యనిర్వాహక కార్యదర్శి పోలేపల్లి సత్యనారాయణ, మున్సిపల్ వైస్ చైర్మన్ లింగస్వామి, బొందయ్య, కృష్ణ, మల్లేశం పాల్గొన్నారు.
ఐసొలేషన్ కేంద్రానికి బెడ్ల అందజేత
చిట్యాల మండలంలోని గుండ్రాంపల్లిలో ఏర్పాటు చేయనున్న ఐసొలేషన్ కేంద్రానికి గ్రేటర్ నల్లగొండ ఎన్ఆర్ఐ ఫోరం తరఫున 10 బెడ్లను బహూకరించినట్లు అనుముల శ్రీనివాస్ తెలిపారు. మిట్టపల్లి సురేశ్గుప్తా, శ్రీనివాస్, బాలరాజు, నర్సింహ, సాయిలు పాల్గొన్నారు.
నాంపల్లి : మండల వైద్యాధికారి డాక్టర్ ఇక్బాల్ మండల కేంద్రంలోని కరోనా బాధితుల ఇండ్లకు వెళ్లి సలహాలు, సూచనలు ఇచ్చారు. కామిశెట్టి పాండు, కర్నె యాదయ్య ఉన్నారు.
కూలీలు నిబంధనలు పాటించాలి
నల్లగొండ రూరల్ : గ్రామంలో ఉపాధి హామీ పనులు నిర్వహించే కూలీలు విధిగా మాస్కులు ధరించడంతోపాటు భౌతిక దూరం పాటించాలని రంగారెడ్డినగర్ పంచాయతీ కార్యదర్శి మౌనిక, ఉప సర్పచ్ బుచ్చిరెడ్డి కోరారు. శుక్రవారం గ్రామంలో పలు ప్రాంతాల్లో ఉపాధి కూలీల వద్దకు వెళ్లి సూచించారు.