డీఆర్డీఓ శేఖర్రెడ్డి
త్రిపురారం మండలం పెద్దదేవులపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రం పరిశీలన
పలు మండలాల్లో కొనుగోళ్లు ప్రారంభం
త్రిపురారం, ఏప్రిల్ 16 : ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కొవిడ్ నిబంధనలు పాటించాలని డీఆర్డీఓ శేఖర్రెడ్డి సూచించారు. మండలంలోని పెద్దదేవులపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్రాల్లో శానిటైజర్ అందుబాటులో ఉంచాలని, భౌతిక దూరం పాటిం చాలని అన్నారు. కేంద్రంలో సీరియల్ ప్రకారం కాంటాలు వేయించి ధాన్యాన్ని మిల్లులకు తరలించాలన్నారు. నాణ్యతా ప్రమాణాలు, తాలుశాతం గురించి రైతులకు తెలియజెప్పాలన్నారు. ధాన్యం కాంటాలు వేసే ముందే రైతుల వద్ద నుంచి బ్యాంకు అకౌంట్, ఆధార్, పట్టాదారు పాస్పుస్తకం తీసుకోవాలన్నారు. హమాలీ క్వింటాకు రూ.34 మాత్రమే తీసుకోవాలన్నారు. ఏఈఓ స్వాతి, ఏపీఎం దిలీప్కుమార్, సీసీలు దేవ్సింగ్, వీబీకేలు మహేశ్వరి, విజయలక్ష్మి, స్వప్న, సైదమ్మ ఉన్నారు.
అడవిదేవులపల్లి : మండలంలోని బంజారాతండా, కొత్తనందికొండ గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను సర్పంచులు కొత్తా మర్రెడ్డి, రమావత్ బాలు ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ ఎండీ మసూద్ షరీఫ్, ఎస్ఐ వీరశేఖర్, ఏపీఎం ఝాన్సీ, సీసీ విజయకుమారి పాల్గొన్నారు.
కేతేపల్లి : కొర్లపహాడ్ గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆర్ఐ బోళ్ల శ్యామ్సుందర్రెడ్డి ప్రారంభించారు. మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కె.సైదిరెడ్డి, సర్పంచ్ ఎడ్ల పార్వతమ్మ, ఎంపీటీసీ ఎడ్ల సంధ్య, సీహెచ్.అంజయ్య, ఎడ్ల ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు.
కొండమల్లేపల్లి : మండలంలోని పెండ్లిపాకల, చింతకుంట్ల గ్రామాల్లో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను చైర్మన్ దూదిపాల వేణుధర్రెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మేకల శ్రీనివాస్ యాదవ్, నేనావత్ శంకర్ నాయక్, డైరెక్టర్లు తదితరులున్నారు.
శాలిగౌరారంలో ..
శాలిగౌరారం: మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శాలిగౌరారం మార్కెట్ కమిటీ చైర్పర్సన్ కట్టా లక్ష్మీవెంకట్రెడ్డి పరిశీలించి మాట్లాడారు. రైతులు ధాన్యాన్ని కల్లాల వద్దనే ఆరబోసుకొని తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. మార్కెట్ కార్యదర్శి వెంకట్రెడ్డి, రైతులు ఉన్నారు.
ఇవి కూడా చదవండి
రికార్డు టైంలో సినిమా కంప్లీట్ చేయనున్న రవితేజ
ఇంజినీరింగ్ సర్వీసెస్ ఎగ్జామ్-2020 మార్కుల జాబితా విడుదల