చండూరు/నాంపల్లి/కనగల్/మర్రిగూడ, జూలై10 : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పట్టణ, పల్లె ప్రగతి పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామని నల్లగొండ జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్పాటిల్ హెచ్చరించారు. సోమవారం చండూరు మున్సిపాలిటీని కలెక్టర్ తనిఖీ చేశారు. మొక్కలు నాటారు. మున్సిపల్ చైర్పర్సన్ తోకల చంద్రకళావెంకన్న, కమిషనర్ బి.వెంక ట్రాం, వైస్ చైర్మన్ దోటి సుజాత, కౌన్సిలర్లు పాల్గొన్నారు. నాంపల్లి మండలంలోని మహ్మదాపురం, చిట్టపాడు, వడ్డేపల్లి, ఎస్డబ్ల్యూ లింగోటం గ్రా మాల్లో పల్లెప్రగతి పనులను కలెక్టర్ పరిశీలించారు. నాంపల్లిలో బస్టాండ్ కోసం స్థలం కేటాయించాలని, చెరువులను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలని జడ్పీటీసీ ఎలుగోటి వెంకటేశ్వర్రెడ్డి కలెక్టర్కు వినతిపత్రం అందించారు. డీపీఎం విష్ణువర్ధన్రెడ్డి, ప్రత్యేకాధికారి శ్రీనివాస్, ఎంపీడీఓ శేశుకుమార్, తాసీల్దార్ లాల్బహద్దూర్, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కుంభం కృష్ణారెడ్డి, సర్పంచులు పాల్గొన్నారు.
విరివిగా మొక్కలు నాటాలి
కనగల్ మండలం జి. యడవల్లి గ్రామంలో అవెన్యూ ప్లాంటేషన్ను కలెక్టర్ పరిశీలించారు. రోడ్డు వెంట మొక్కలు విరివిగా నాటాలని సూచించారు. ఆయన వెంట అసిస్టెంట్ ట్త్రైనీ కలెక్టర్ అపూర్వ్చౌహన్, తాసీల్దార్ శ్రీనివాస్రావు, సర్పంచ్ పులకరం యాదమ్మామారయ్య, ఎంపీటీసీ కర్నాటి పద్మ పాల్గొన్నారు.మర్రిగూడ మండలంలోని బట్లపల్లి, మర్రిగూడ, సరంపేట గ్రామాల్లో పల్లె ప్రగతి పనులను కలెక్టర్ పరిశీలించారు. వట్టిపల్లి సర్పంచ్ కల్లు స్వాతీనవీన్రెడ్డిని అభినందించారు. అంతంపేట, సరంపేటలో లింకురోడ్లకు మరమ్మతు పనులు చేపట్టాలని ఎంపీపీ మెండు మోహన్రెడ్డి కలెక్టర్కు వినతిపత్రం అందించారు. శివన్నగూడెం ప్రాజెక్టు పరిధిలో ఇండ్లు కోల్పోయిన వారిని ఆదుకోవాలని జడ్పీటీసీ పాశం సురేందర్రెడ్డి వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో తాసీల్దార్ దేశ్యానాయక్, ఎంపీడీఓ రమేశ్దీన్దయాళ్, ఎంపీఓ ఝాన్సీరెడ్డి, ఏపీఎం అశోక్, ఈసీ వివేక్, సర్పంచులు నల్ల యాదయ్య, నున్సావత్ సక్కుబాయి, వెంకటమ్మ పాల్గొన్నారు.