హరితహారంతో పచ్చదనం నాలుగు శాతం పెరిగిందని, వచ్చే రెండు, మూడేండ్లలో అడవుల విస్తీర్ణాన్ని 33 పెంచాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర అటవీ, దేవాదాయ శాఖల మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డితో కలిసి సోమవారం భువనగిరి పట్టణంలో అటవీ క్షేత్రాధికారి నివాస భవనాన్ని ప్రారంభించారు. వద్ద అటవీ శాఖ అభివృద్ధి చేసిన ఆంజనేయ అరణ్యం (రాయగిరి-1) అర్బన్ పార్కును సందర్శించి మొక్కలు నాటారు. గత హరితహారంలో నాటిన మొక్కలను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్రెడ్డి మాట్లాడుతూ రాయగిరి అర్బన్ పార్కులో నాటిన 30వేల మొక్కలు పెరిగి మహావృక్షాలుగా మారాయన్నారు. హరితహారంతో రాష్ట్ర పచ్చదనం సంతరించుకుందని పెంపొందించి పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నదని, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని మండలం ఇబ్రహీంపురంలో శాఖకు కేటాయించిన భూమిని మంత్రులు సందర్శించారు. సీఏ బ్లాక్ను ప్రారంభించి నాటారు. ప్రభుత్వ విప్ సునీత, ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి, జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్రెడ్డి, ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి, కలెక్టర్ పమేలా సత్పతి, ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్టు ఆర్.శోభ, అధికారులు