కనగల్, జూలై 11 : పల్లెల అభివృద్ధితోనే రాష్ట్ర ప్రగతి సాధ్యమవుతుందని ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి అన్నారు. శనివారం కనగల్లో పల్లెనిద్ర చేసిన ఎమ్మెల్యే ఆదివారం రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పల్లెల ప్రగతిపై ప్రత్యేక దృష్టి సారించారని తెలిపారు. పల్లెప్రగతి కార్యక్రమంతో గ్రామాల్లో గుణాత్మక మార్పులు కనిపిస్తున్నాయన్నారు. భారీ వర్షాన్ని సైతం లెక్కచేయకుండా పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. కనగల్ మండల కేంద్రంలో 120 డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. క్రాస్రోడ్డులో రూ.32 లక్షలతో నిర్మించిన స్త్రీ శక్తి భవనం, రూ.22 లక్షలతో నిర్మించిన రైతువేదిక భవనంతోపాటు వైకుంఠధామం, బుడుమర్లపల్లిలో వైకుంఠధామం, పల్లెప్రకృతి వనం, బోయినపల్లిలో పంచాయతీ భవనం, సీసీ రోడ్ల నిర్మాణం, వైకుంఠధామాన్ని ఆయన ప్రారంభించారు.
కనగల్ పంచాయతీ మల్టీపర్పస్ వర్కర్ నాగేందర్ ఇటీవల గుండెపోటుతో మృతిచెందగా ఆయన కుటంబానికి రూ.50 వేల సాయం అందించారు. కార్యక్రమంలో ఎంపీపీ కరీంపాషా, జడ్పీటీసీ చిట్ల వెంకటేశం, పీఏసీఎస్ చైర్మన్లు వంగాల సహదేవరెడ్డి, దోటి శ్రీనివాస్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ఐతగోని యాదయ్య, సర్పంచులు నర్సింగ్ సునీతాకృష్ణయ్య, కారింగు పార్వతమ్మాజానయ్య, పగిళ్ల యాదయ్య, ఎంపీటీసీ పాలకూరి సైదులు, టీఆర్ఎస్ నాయకుడు కటికం సత్తయ్యగౌడ్, గోనె రవీందర్రావు, దాసరి వెంకన్న డీఈ నాగయ్య, తాసీల్దార్ శ్రీనివాస్రావు, ఎంపీడీఓ సోమసుందర్రెడ్డి, ఏఓ అమరేందర్గౌడ్, ఆలయ చైర్మన్ యాదగిరి, ఏఈలు సంజీవ, దినేశ్రెడ్డి, శ్రీనివాస్, షఫీ పాల్గొన్నారు.
తిప్పర్తిలో పల్లెనిద్ర..
తిప్పర్తి : మండల కేంద్రంలో ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి పర్యటించి నూకలవారిగూడెంలో సమస్యలను తెలుసుకున్నారు. గుర్తించిన సమస్యలన్నీ త్వరగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం రైతువేదిక భవనంలో పల్లెనిద్ర చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ నాగులవంచ విజయలక్ష్మి, జడ్పీటీసీ పాశం రాంరెడ్డి, సర్పంచ్ రొట్టెల రమేశ్, డీసీసీబీ డైరెక్టర్ పాశం సంపత్రెడ్డి, ముత్తినేని శ్యాంసుందర్, డిప్యూటీ కలెక్టర్ జగన్నాథరావు, తాసీల్దార్ కృష్ణయ్య, ఎంపీడీఓ మహేందర్రెడ్డి, ఏఓ సన్నిరాజు, టీఆర్ఎస్ నాయకులు పల్రెడ్డి రవీందర్రెడ్డి, కందుల లక్ష్మయ్య, జాకటి మోష పాల్గొన్నారు.