బొమ్మలరామారం, జూన్ 9 : మండలంలోని అన్ని గ్రామాల్లో గొలుసుకట్టు కాలువలు పునరుద్ధరణ పనులు నెల రోజుల్లో పూర్తి చేయాలని ఎంపీపీ తాండ్ర అమరావతి అన్నారు. మండల పరి షత్ కార్యాలయంలో బుధవారం చెరువుల గొలుసుకట్టు కాలువ ల పునరుద్ధరణపై ఎంపీడీవో, ఎంపీవో, ఏఈ ఐబీ, అర్డబ్లూఎస్ , పంచాయతీ కార్యదర్శులకు, ఉపాధి హామీ సిబ్బందికి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామాల్లో పనులు గుర్తించి, త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. పనులు అమలు చేయడంలో ఇబ్బందులు తలెత్తితే స్థానిక సర్పం చ్లు, ఎంపీటీసీలతో సమన్వయం, సహకారంతో పనులు పూర్తి చేయాలన్నారు. దేవాదుల ప్రాజెక్ట్ ద్వారా వచ్చే ప్రతి నీటి బొట్టు ని రైతుల పోలాలకు మళ్లించేలా అధికారులు కృషి చేయాలన్నా రు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ కోఆప్షన్ సభ్యుడు ఎండీ ఖలీల్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.