ప్రజలకు అందుబాటులో ఉండాలి
ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
నకిరేకల్ మున్సిపల్ చైర్మన్,
వైస్ చైర్మన్ బాధ్యతల స్వీకరణ
కట్టంగూర్(నకిరేకల్), మే 8 : మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలను పరిష్కరించేందుకు కొత్త పాలవర్గం కృషి చేయాలని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. నకిరేకల్ మున్సిపాలిటీ నూతన చైర్మన్, వైస్ చైర్పర్సన్గా ఎన్నికైన రాచకొండ శ్రీనివాస్, మురారిశెట్టి ఉమారాణి శనివారం మున్సిపల్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ మున్సిపాలిటీకి అభివృద్ధికి అవసరమైన నిధులు మంజూరు చేసేందుకు కృషి చేస్తానన్నారు. కౌన్సిలర్లు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ మౌలిక వసతులు, ఇతర అవసరాలు తీర్చాలని తెలిపారు. ప్రతి సమస్యను ఎప్పటికప్పుడు తనకు, అధికారులు దృష్టి తీసుకురావాలని సూచించారు. పట్టణానికి దాదాపు రూ.12కోట్లతో డ్రైనేజీ, రోడ్లు, వీధి దీపాలు ఏర్పాటుతో పాటు అనేక అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. రూ.15 కోట్లతో బైపాస్ నుంచి ఇనుపాముల స్టేజీ వరకు సెంట్రల్ లైటింగ్ ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపించామని చెప్పారు. రాజకీయాలకు అతీతంగా మున్సిపాలిటీని అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు కలిసికట్టుగా పని చేద్దామని కోరారు. మున్సిపల్ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్, వైస్ చైర్మన్ మురారిశెట్టి ఉమారాణి మాట్లాడుతూ మున్సిపాలిటీలో నెలకొన్న సమస్యలను అధికారులు, ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య దృష్టికి తీసుకెళ్లి దశల వారీగా పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. తమను ఎన్నుకున్న ప్రజలు, అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్, మంత్రి జగదీశ్రెడ్డి, ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం పాలకవర్గం సభ్యులను ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సన్మాంచారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నల్ల బాలాజీ, మార్కెట్ కమిటీ చైర్మన్ నడికుడి ఉమారాణి, జడ్పీటీసీ మాద ధనలక్ష్మి, కౌన్సిలర్లు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.