బొమ్మలరామారం, జూన్6: రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యే యమని టెస్కాబ్ వైస్ చైర్మన్, డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేం దర్రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని పీఏసీఎస్ కార్యాల యంలో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తీసువచ్చిన ప్ర తి రైతు ధాన్యాన్ని తప్పక కొనుగోలు చేస్తామన్నారు. రైతులు పుకార్లు నమ్మవద్దని, ప్రభుత్వం రైతుల అభివృద్ధి కోసం నిరం తరం పాటు పడుతున్నదన్నారు. సీఎం కేసీఆర్ తెలంగాణలో సాగు నీటి సమస్య శాశ్వత పరిష్కారం కోసం నిర్మించిన కాలేశ్వ రం ప్రాజెక్ట్తో పంట సాగు పెరిగిందన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో కోటి 15 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి రాష్ట్రంలోనే ధాన్యం కొనుగోలులో నంబర్వన్గా నిలిచా మన్నారు. రెండు రోజుల్లో పూర్తి స్థాయిలో ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేస్తామన్నారు. ఆనంతరం పీఏసీఎస్ చైర్మన్ అధ్వర్యం లో ఆయనను శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో ఎం పీపీ సుధీర్ రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ బాలనర్సయ్య, వైస్ చైర్మన్ కొండల్ రెడ్డి, మండలాధ్యక్షుడు వెంకటేశ్ గౌడ్, మండల స ర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు గణేశ్ ముదిరాజ్, నాయకులు బీర ప్ప, శ్రీనివాస్ గౌడ్, చంద్రమౌళి ముదిరాజ్, నవీన్ గౌడ్, పాపి రెడ్డి, యాదగిరి ముదిరాజ్, శాంతాచారి, రవి పాల్గొన్నారు.