మిర్యాలగూడ, జూలై 5 : పచ్చని మొక్కలతో జనావాసాలు కళకళలాడుతూ పరిశుభ్రంగా ఉండాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పల్లె, పట్టణ ప్రగతి ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు. ముందుగా గ్రామ సభల ద్వారా సమస్యలను గుర్తించిన ప్రజా ప్రతినిధులు, అధికారులు వాటిని ప్రాధాన్యతాక్రమంలో పరిష్కరిస్తున్నారు. మిర్యాలగూడ మండలంలో అవంతీపురం, బాదలాపురం గ్రామాల్లో ఎంపీడీఓ దేవిక పర్యటించి అభివృద్ధ్ది పనులను పరిశీలించారు. పలు గ్రామాల్లో శ్రమదానంతో కంపచెట్లు తొలగించారు. మాడ్గులపల్లి మండలం మాచనపల్లి, నారాయణపురం, కేశవాపురం గ్రామాలను ప్రత్యేకాధికారి నాగేశ్వర్రావు సందర్శించి డంపింగ్ యార్డులు, పల్లె ప్రకృతివనాలు, వైకుంఠ ధామాలను పరిశీలించారు. దామరచర్ల మండలంలో నూనావత్తండా,బాండావత్తండాను మండల ప్రత్యేకాధికారి పోరెడ్డి నాగమణి పరిశీలించి అభివృద్ధ్ది పనులపై పలు సూచనలు చేశారు. అడవిదేవులపల్లి మండలంలో ప్రత్యేకాధికారి నరేందర్ పలు గ్రామాలను సందర్శించి మొక్కలను పంపిణీ చేశారు. వేములపల్లి మండలంలో పలు గ్రామాల్లో లూజ్గా ఉన్న విద్యుత్ తీగలను సరిచేశారు. మొక్కలు పంపిణీ చేశారు. కార్యక్రమాల్లో ఎంపీపీ బాలాజీ, ఎంపీడీఓలు జితేందర్రెడ్డి, జ్యోతిలక్ష్మి, మసూద్షరీఫ్, సర్పంచులు వెంకటరమణచౌదరి, లలిత, పద్మ, నాగార్జునరెడ్డి, కరుణాకర్రెడ్డి, పద్మ, వెంకట్రెడ్డి ఉన్నారు.
దేవరకొండ నియోజకవర్గంలో..
దేవరకొండ : పట్టణంలోని 10,15వ వార్డులో చెత్తను తొలగించారు. కమిషనర్, ఆయా వార్డు కౌన్సిలర్ కాలనీల్లో పర్యటిం చి సమస్యలను గుర్తించి పరిష్కరించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ కాలనీల్లో పరిశుభ్రతను పాటించాలని సూచించారు. ప్రధాన రహదారుల వెంట మొక్కలు నాటి పచ్చదనంగా పర్చుకునేలా చొరవ చూపాలని కోరారు. దేవరకొండ మండలం మైనంపల్లి, ముదిగొండ గ్రామాల్లో డీపీఓ, ఆర్డీఓ విష్ణువర్ధన్రెడ్డి, గోపీరాం పాల్గొని మొక్కలు నాటారు. చందంపేట మండల కేంద్రంలో మండల ప్రత్యేకాధికారి, ప్రజాప్రతినిధులు పాల్గొని చెత్తను తొలిగించి, మొక్కలను పంపిణీ చేశారు. చింతపల్లి మండలం కుర్మేడులో జడ్పీటీసీ కంకణాల ప్రవీణావెంకట్రెడ్డి మొక్కలతో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమాల్లో కమిషనర్ వెంకటయ్య, చింతపల్లి ఎంపీపీ కొండూరు భవానీపవన్, కౌన్సిలర్ జయప్రకాశ్నారాయణ, వైస్ చైర్మన్ రహత్ అలీ సర్పంచులు, కవితాగిరి, అనురాధానారాయణరెడ్డి, మల్లారెడ్డి, జంగమ్మ, శంకర్రావు పాల్గొన్నారు.
చొత్త తొలగింపు
నందికొండ : మున్సిపాలిటీలోని 12వ వార్డులో పారిశుధ్యం, డ్రైనేజీ పనులను, 7వ వార్డులో కౌన్సిలర్ నిమ్మల ఇందిరాగౌడ్ వీధుల్లో చెత్త తొలగింపు, 4వ వార్డులో వైస్ చైర్మన్ పారిశుధ్య పనులు, 1,5,3వ వార్డుల్లో కౌన్సిలర్లు మంగ్తా, రమేశ్జీ, నాగరాణి హరితహారం, 9 వార్డులో కౌన్సిలర్ ఇర్ల రామకృష్ణ రోడ్డు వెంట మొక్కలను నాటారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ కర్న అనూషారెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కర్న బ్రహ్మానందరెడ్డి, మున్సిపల్ కమిషనర్ రవీందర్రెడ్డి పాల్గొన్నారు.
మొక్కల పరిశీలన
పెద్దవూర : పెద్దవూర నుంచి సమ్మక్క సారక్క ఆలయం వరకు రోడ్డు వెంట నా టిన మొక్కలను డీపీఓ విష్ణు వర్ధన్రెడ్డి పరిశీలించారు. మొక్కల సంరక్షణపై పలు సూ చనలు చేశారు. ఎంపీడీఓ దుబ్బాశ్యామ్, ఎంపీఓ విజయ కుమారి, కార్యదర్శులు ఢాకూనాయక్ ఉన్నారు.
ఇంటింటికీ మొక్కల పంపిణీ
గుర్రంపోడు: మండలంలో తానేదార్పల్లి, తేనెపల్లి, ముల్కలపల్లి, పోచంపల్లి గ్రామా ల్లో మండల ప్రత్యేకాధికారి భిక్షపతి ఇంటింటికీ మొక్కలు పంపిణీ చేశారు. ఎంపీడీఓ శ్రీపాద సుధాకర్, ఏపీఓ శ్రీనివాస్, సర్పంచులు బొల్లు శ్రీనివాస్రెడ్డి, చనమల్ల రజితాప్రతాప్రెడ్డి, మండలి దీపారాము, తిరుమల్రెడ్డి పాల్గొన్నారు.