నిడమనూరు, ఏప్రిల్ 2 : నాగార్జున సాగర్ నియోజకవర్గ సమగ్రాభివృద్ధే సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీ ధ్యేయమని ఉప ఎన్నికల ఇన్చార్జీలు, మిర్యాలగూడ, వర్ధన్నపేట ఎమ్మెల్యేలు నల్లమోతు భాస్కర్రావు, ఆరూరి రమేశ్ అన్నారు. నోముల భగత్ కుమార్కు మద్దతుగా తుమ్మడం గ్రామంలో ఇంటింటికీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు మాట్లాడుతూ ముప్పయ్యేండ్ల కాంగ్రెస్ పాలనలో నియోజకవర్గ అభివృద్ధి మచ్చుకైనా లేదన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో హాలియా, నందికొండ మున్సిపాలిటీలు, వరద కాల్వ, నెల్లికల్ లిఫ్టు, డిగ్రీ కళాశాల, రాజవరం చివరి భూములకు నీళ్లిచ్చిన సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని ఓటు ద్వారా బలపర్చాలని కోరారు. దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య ఏ పని మొదలుపెట్టినా తుమ్మడం గ్రామం నుంచే మొదలు పెట్టేవారని, ప్రజల కోసం నిరంతరం పాటుపడిన నర్సింహయ్య తనయుడు, భగత్ను ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏనాడైనా ప్రజల గురించి ఆలోచించిన దాఖలాలు లేవన్నారు. సబ్బండ కులాలకు మేలు చేసే లక్ష్యంతో సీఎం కేసీఆర్ పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో నోముల లక్ష్మి, ఎంపీపీ బొల్లం జయమ్మ, మిర్యాలగూడ మున్సిపల్ వైస్ చైర్మన్ కుర్ర విష్ణు, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు తాటి సత్యపాల్, ఎంపీటీసీ పెదమాం యాదయ్య, మండల పరిషత్ సలహాదారుడు బొల్లం రవియాదవ్, వార్డు సభ్యుడు కోటయ్య, నాయకులు సామ వెంకట్రాములు, సుధాకర్రెడ్డి, వెంకటేశ్వర్లు, వెంకన్న, విఘ్నేశ్, మైసమ్మ, అలివేలు పాల్గొన్నారు. మండలంలోని ముకుందాపురంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన వార్డు సభ్యులు నలుగురు, 50కుటుంబాల వారు ఎమ్మెల్యేల సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు.
ఇవీ కూడా చదవండి..
ఇండోనేషియా రిఫైనరీలో భారీ అగ్ని ప్రమాదం
మయన్మార్ రక్తపాతం.. దారుణం, భయంకరమన్న బైడెన్
అలస్కాలో కుప్పకూలిన హెలికాప్టర్..
బెలారస్లో నిరసనలు.. 170 మంది అరెస్ట్
జపాన్లో భూకంపం.. రిక్టర్ స్కేల్పై 5.8 తీవ్రత