నల్లగొండ, ఏప్రిల్ 2: యాసంగి సీజన్లో పండిన వడ్ల కొనుగోలుకు అధికార యం త్రాంగం ఏర్పాట్లు చేస్తున్నది. నూతన వ్యవసాయ చట్టాలతో కేంద్ర ప్రభుత్వం మార్కెటింగ్ వ్యవస్థను నిర్వీర్యం చేసినప్పటికీ రైతు పండించిన పంటకు మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేసే బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్నది. ఇందుకు ఒక్క గింజనూ వదిలి పెట్టకుండా కొనుగోలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో మార్చి 30న అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ సంబంధిత అధికారులు, మిల్లర్లు, ధాన్యం రవాణా చేసే కాంట్రాక్టర్లతో సమావేశమయ్యారు.ధాన్యం కొనుగోలు చేయడంతో పాటు ఎప్పటికప్పుడు మిల్లుల్లోకి రవాణా చేసి డబ్బులు వెంటనే ఇచ్చేలా ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
365 కేంద్రాల్లో కొనుగోలుకు చర్యలు
జిల్లాలో గతేడాది 334 కేంద్రాల ద్వారా ధాన్యం సేకరణ చేపట్టగా ఈసారి అంతకు మించి ఏర్పాటు చేస్తున్నది. ప్రతి వ్యవసాయ క్లస్టర్ పరిధిలో రెండు నుంచి మూడు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. డీఆర్డీఏ పరిధిలోని ఐకేపీల ఆధ్వర్యంలో 191 కేంద్రాలు, పీఏసీఎస్ ఆధ్వర్యంలో 157 కేంద్రాలు, మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో మరో 17 కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు.
7.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ..
జిల్లా వ్యాప్తంగా ఈసారి 9.80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి కానుండగా అందులో 1.89 లక్షల సన్న ధాన్యం కాగా 12 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం స్థానిక అవసరాలకు పోతున్నది. 2 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మిల్లర్లు కొనుగోలు చేయగా మిగిలిన 7.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మార్కెట్కు వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. గతేడాది యాసంగిలో 6.46 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయగా ఈ సారి అంతకుమించి మార్కెట్కు వచ్చే అవకాశం ఉంది.
ఏడు నుంచి కొనుగోలు కేంద్రాల ప్రారంభం
యాసంగికి సంబంధించి ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో కోతలు ప్రారంభించడంతో ఈ నెల 7 నుంచి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని అధికార యంత్రాంగం సిద్ధమైంది. గన్నీ బ్యాగులు ప్రస్తుతం 70 లక్షలు అందుబాటులో ఉండగా మరో కోటి తెప్పించే విధంగా సివిల్ సప్లయ్ యంత్రాంగం ఏర్పాట్లు చేస్తున్నది. ఇక కొనుగోలు చేసిన ధాన్యం ఎప్పటికప్పుడే మిల్లులకు రవాణా చేసేందుకు ఐదు లారీ ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్లకు బాధ్యతలు అప్పగించింది. కొనుగోలు చేసిన ధాన్యం ఎప్పటికప్పుడే ప్రతి రోజూ 700 నుంచి 800 లారీలు రవాణా చేయాలని ఆదేశించారు. క్వింటాకు మద్దతు ధర రూ.1,888 చెల్లించేలా చర్యలు తీసుకుంటున్న యంత్రాంగం తేమ శాతం 17 లోపు ఉండాలనే నిబంధన తప్పనిసరి చేసింది.
ఇవీ కూడా చదవండి..
మయన్మార్ రక్తసిక్తం.. పోలీస్ కాల్పుల్లో 90 మందికిపైగా మృతి
మోదీ బంగ్లా పర్యటనలో ఐదు ఒప్పందాలపై సంతకాలు
క్రిప్టో కరెన్సీపై నిషేధం వద్దు : కేంద్రానికి ఇద్దరు పారిశ్రామికవేత్తల వినతి
బంగ్లాదేశ్లో మతువ తెగలతో మాట్లాడిన ప్రధాని మోదీ
కూరలో విలువైన ముత్యం.. థాయ్ పేదింటి మహిళకు అదృష్టం