గుర్రంపోడు, ఏప్రిల్ 1 : సోషల్ మీడియా వారియర్స్ టీఆర్ఎస్ పార్టీ కోసం సైనికుల్లా పని చేయాలని విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని ఆములూర్ గ్రామంలో ఏర్పాటుచేసిన సోషల్ మీడియా వారియర్స్ సమావేశంలో ఆయన మాట్లాడారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి వేగంగా తీసుకెళ్లాలని సూచించారు. వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్ల ద్వారా ఓటర్లకు చేరవేయాలని కోరారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి, ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్రెడ్డి, గాదరి కిశోర్, జడ్పీ చైర్మన్ బండా నరేందర్రెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు సుంకరి మల్లేశ్గౌడ్, మాజీ జడ్పీటీసీ గాలి రవికుమార్గౌడ్, సోషల్ మీడియా ఇన్చార్జి సతీశ్రెడ్డి పాల్గొన్నారు.
భగత్ గెలుపును ఎవరూ ఆపలేరు.. : మంత్రి
కాంగ్రెస్ నాయకులకు సాగర్ ఉప ఎన్నికల్లో గుణపాఠం తప్పదని, ఎవరెన్ని కుట్రలు చేసినా నోముల భగత్ విజయం ఆపలేరని మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. గురువారం ఎమ్మెల్యేలు రవీంద్రకుమార్, గాదరి కిశోర్, శానంపూడి సైదిరెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తక్కెళ్లపల్లి రవీందర్రావు, కడారి అంజయ్యతో కలిసి తిరుమలగిరిలో మాట్లాడారు. టీఆర్ఎస్ అన్నివర్గాల ప్రజలను అక్కున చేర్చుకున్నదని, కులవృత్తులకు పెద్దపీట వేసిందని తెలిపారు. సాగర్లో టీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు ఖాయమన్నారు. భగత్ భారీ మెజార్టీతో గెలుస్తాడన్నారు.
పలు గ్రామాల్లో ప్రచారం
తిరుమలగిరి(సాగర్) మండలంలోని మేగ్యాతండా, శీతలతండా, ధన్సింగ్తండాల్లో టీఆర్ఎస్ నాయకుడు, ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు. భగత్ను గెలిపించాలని గడప గడపకూ వెళ్లి ఓటర్లను అభ్యర్థించారు. శ్రీనునాయక్, ప్రవీణ్నాయక్, బాబూరావు పాల్గొన్నారు.