నందికొండ: నాగార్జునసాగర్ డ్యాం నిర్మాణ సమయంలో వాడిన వస్తువులు, పనికి రాని వస్తువులను గతంలో నందికొండ పైలాన్ కాలనీలోని వర్క్ షాపులో భద్ర పరిచారు. సామగ్రి ఉపయోగకరంగా లేకపోవడంతో వాటిని తొలగించాలని ఎన్నెస్పీ అధికారులు నిర్ణయించి అన్ లైన్లో రూ.2,99,45,845లకు టెండర్లను పిలిచారు.
దీంతో వర్క్షాపులో భద్ర పరిచిన కాపర్ను ప్రశాంతి ఇండస్ట్రీ, అల్యూమినియంను వైష్ణవి ఇండస్ట్రీ, యంఎస్ స్క్రాప్ను మైత్రి ఇంజనీరింగ్ అండ్ ఎలక్ట్రానిక్స్, జీఎ స్క్రాప్ను స్టార్ ట్రెడర్స్, సీ క్లాస్ మిషనరీలను ఏఆర్ ఎంటర్ ప్రైజెస్, ఇత్తడిని శ్రీరావు సివిల్ కాంట్రాక్టర్లు టెండర్ల ద్వారా దక్కించుకున్నారు.
వర్క్ షాపులోని సామగ్రి తరిలింపు కోసం మిషనరీలు, ఐరన్ గ్రిడ్డర్స్ల కటింగ్ పనులను సిబ్బందితో చేపడుతున్నారు. సామగ్రి తరలింపు పనులను ఎన్నెస్పీ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. నిర్మాణం