నందికొండ: నాగార్జునసాగర్ రిజర్వాయర్కు వదర ఉధృతి తగ్గడంతో డ్యాం క్రస్ట్ గేట్ల ద్వారా నీటి విడుదలను శనివారం నిలుపుదల చేశారు. ఉదయం 9 గంటల వరకు డ్యాం 4 క్రస్ట్ గేట్ల ద్వారా 131497 క్యూసెక్కల నీటిని విడుదలను కొన సాగించారు. నాగార్జునసాగర్ రిజర్వాయర్ పూర్తి నీటి సామర్ధ్యం 590 (312.4050 టీఎంసీలు) అడుగులకు గాను 589.40 అడుగుల (310.2522 టీఎంసీల) మేర నీరు నిల్వ ఉంది.
నాగార్జునసాగర్ రిజర్వాయర్ నుంచి ఎడమ కాల్వ ద్వారా 7601 క్యూసెక్కులు, కుడి కాల్వ ద్వారా 8755 క్యూసెక్కు లు, ఎస్ఎల్బీసీ ద్వారా 1800 క్యూసెక్కులు, ప్రధాన జలవిద్యుత్ కేంద్రం ద్వారా 32724 క్యూసెక్కులు, వరద కాల్వ ద్వారా 400 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
నాగార్జునసాగర్ రిజర్వాయర్ నుంచి 51280 క్యూసెక్కుల అవుట్ఫ్లో కొనసాగుతుండగా, 34680 క్యూసె క్కుల ఇన్ఫ్లో ఉంది. శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులకు ప్రస్తుతం 8847.70 అడుగులు ( 213.8824 టీఎం సీలు) ఉంది. శ్రీశైలంకు 77936 క్యూసెక్కుల ఇన్ఫ్లో కొనసాగుతుంది.