మునుగోడు: టీఆర్ఎస్ పార్టీని గ్రామ స్థాయి నుంచి తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దాలని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఉమ్మ డి నల్లగొండ జిల్లా ఇన్చార్జి తక్కళ్లపల్లి రవీందర్రావు గులాబీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సోమవారం స్థానిక సత్య ఫంక్షన్హాల్లో పార్టీ మండల ఎన్నికల అధికారి గుర్రం వెంకట్రెడ్డి ఆధ్వర్యంలో టీఆర్ఎస్ మండల నూతన కమిటీ ఎన్నికకు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ముఖ్య కార్యకర్తలతో ఏర్పాటు చేసిన సమావేశంలో రవీందర్రావు మాట్లాడుతూ అన్ని వర్గాల సంక్షేమం కోసం టీఆర్ఎస్ సర్కారు అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. నిరంతరం పార్టీ అభ్యున్నతి కోసం కృషి చేసే వారిని టీఆర్ఎస్ అధిష్టానం గుర్తించి పదవులు కట్టబెడుతుందని స్పష్టం చేశారు.
అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట వేసిన టీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని, ఇతర పార్టీల నాయ కులు పెద్ద ఎత్తున టీఆర్ఎస్లో చేరుతుండటమే ఇందుకు నిదర్శనమన్నారు. గులాబీ పార్టీలోని సామాన్య కార్యకర్తకూ ప్రజలకు సేవ చేసే అదృష్టం దక్కిందని, అది ఒక్క టీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమని కొనియాడారు. టీఆర్ఎస్ పార్టీ మండల నూతన అధ్యక్ష పదవిని చేపట్టేందుకు ఆరుగురు ఆశావహులు ఆసక్తి కనబరుస్తున్నారని, పూర్తి స్థాయిలో పరిశీలించి త్వరలోనే మండల నూతన కమిటీని ప్రకటిస్తామని వెల్లడించారు.
కార్యక్రమంలో జడ్పీటీసీ నారబోయిన స్వరూపారాణి, ఎంపీపీ కర్నాటి స్వామి, మండలాధ్యక్షుడు బండా పురుషోత్తంరెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నారబోయిన రవి, వైస్ ఎంపీపీ అనంత వీణ, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ జాజుల అంజయ్య గౌడ్, ఎంపీటీసీ చెరుకు కృష్ణయ్య, నాయకులు దాడి శ్రీనివాసరెడ్డి, భవనం శ్రీనివాస రెడ్డి, బొడ్డు నర్సింహాగౌడ్, ఏరుకొండ శ్రీను, శరత్, చలమళ్ల వెంకట్రెడ్డి, గుర్రాల పరమేశ్, ఆయా గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, కార్యకర్తలు పాల్గొన్నారు.