కేతేపల్లి: మూసీ ప్రాజెక్టు ఐదు గేట్ల ద్వారా సోమవారం దిగువకు నీటి విడుదల కొనసాగింది. ప్రాజెక్టులోకి ఎగువ ప్రాంతాల నుంచి 7490.14 క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చింది. ప్రాజెక్టు గేట్ల ద్వారా 9111.80 క్యూసెక్కులు దిగువకు వదులుతు న్నారు.
కాలువలకు 139.32 క్యూసెక్కులు వెళుతుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 645 అడుగులు(4.46 టీఎంసీలు) కాగా, ప్రస్తుతం 641.30 అడుగులు(3.52 టీఎంసీలు)గా ఉన్నట్లు ఏఈ ఉదయ్కుమార్ తెలిపారు.