మిర్యాలగూడ టౌన్: నీతి ఆయోగ్, సీఎస్ఐఆర్ కేంద్ర పథకం ద్వారా అందిస్తున్న ఇంటింటికీ ఉచిత శానిటైజేషన్ను ప్రజ లు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు అన్నారు. మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాల యంలో మున్సిపల్ సిబ్బందితో కలసి ఉచిత శానిటైజేషన్ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కరోనా నుంచి విముక్తి పొందేందుకు ప్రభుత్వం అందజేస్తున్న ఈ కార్యక్రమంల ద్వారా ప్రతి ఒక్కరూ తమ తమ ఇండ్లను శానిటేషన్ చేయించుకోవాలన్నారు. కార్యక్రమంలో దుర్గంపూడి నారాయణరెడ్డి, వీరకోటిరెడ్డి, హతీరామ్, బారెడ్డి ఆశోక్రెడ్డి, నేమాద్రి రవి, నాగేశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు.