మిర్యాలగూడ: రైతులకు వ్యతిరేకంగా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలను తీసుకోదని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు ఆలగడప పరిసర రైతులకు బరోసా ఇచ్చారు. ఆయన ఆదివారం సెజ్ల ఏర్పాటుపై ఒక ప్రకటన విడుదల చేశారు. ఆలగడప వద్ద శనివారం జరిగిన ఘటన దురదృష్టకరంగా పేర్కొన్నారు. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్, ఆర్డీవో దృష్టికి తీసుకెళ్లడం జరిగిందన్నారు.
ఈ ప్రాంతంలో ఎలాంటి సెజ్లను పెట్టడానికి సమ్మతించమని తెలిపామన్నారు. అయినప్పటకీ టీఎస్ఐఐసీ ఎండీ ఏమర పాటుగా ఏరియల్ సర్వేకు ప్రతినిధులను పంపించడం విచారకరమన్నారు. ప్రజలకు, రైతులకు అవసరం లేని అంశాన్ని వారి మీద బలవంతంగా రుద్దడం మంచి పద్దతి కాదన్నారు. ఆలగడప పరిసర ప్రాంతాల్లో పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు నిర్ణయాన్ని రద్దు చేయాలని సీఎం కేసీఆర్కు, మంత్రి జగదీశ్రెడ్డి దృష్టికి తీసుకెళ్లామని వారు సెజ్లను రద్దు చేయిస్తామనీ హామీ ఇవ్వడం జరిగిందన్నారు.
ఆలగడప, రాయినిపాలెం, జాలుబాయితండా, అవంతీపురం పరిసర గ్రామాల ప్రజలు ఎలాంటి బయాందోళనలు పెట్టుకో వద్దన్నారు. ప్రజలు సంయమనంతో ఉండాలన్నారు. ఎట్టి పరిస్థితిలో ఈప్రాంతలో సెజ్ల ఏర్పాట కాకుండా చూస్తానన్నా రు. అనవరసంగా కొంతమంది ఈ విషయంపై రెచ్చగొట్టె ధోరణిలో రైతులను ఊబిలోకి లాగుతున్నారన్నారు. చెప్పుడు మాటలు ఎవ్వరూ పట్టించుకోవద్దన్నారు. నాకు వైరల్ ఫీవర్ రావడంతో కొంత జాప్యం వచ్చి ఇంత రాద్దాంతం జరిగింద న్నారు.
రైతులు ఎవరూ ఆవేశాలకు గురి కావద్దన్నారు. 100 శాతం సెజ్లను ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయ కుండా రైతుల పక్షాన ఉంటానన్నారు. వ్యవసాయంపై ఆధారపడ్డ సన్న,చిన్న కారు రైతుల కుటుంబాలను ఎలాంటి ఇబ్బందులు పెట్టవద్దని, టీఎస్ఐఐసీ ఎండీ ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని అన్నారు.