మిర్యాలగూడ: తెలంగాణ రాష్ట్రంలో మద్యం దుకాణాల కేటాయింపుల్లో గౌడ సమాజానికి 15శాతం రిజర్వేషన్లు కేటాయిం చడాన్ని హర్శిస్తూ పట్టణ గౌడ సంఘం నాయకులు పెద్ది శ్రీనివాస్గౌడ్ ఆధ్వర్యంలో శనివారం సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గౌడ కులస్తులకు మధ్యం దుకాణాల్లో రిజర్వేషన్లు కల్పించడం వలన ఆర్థికంగా బలోపేతం చెందుతారన్నారు. రిజర్వేషన్ సౌకర్యం కల్పించిన సీఎం కేసీఆర్కు సంఘం తరుపున కృతజ్ఞత లు తెలిపారు. కార్యక్రమంలో గుండు శ్రీరాములుగౌడ్, జేరిపోతుల రాములుగౌడ్, వెంకన్న, మహేశ్, రాములు, లింగయ్య పాల్గొన్నారు.