నల్లగొండ : కొండమల్లేపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అదనపు గదులను, పలు పరికరాలను మంత్రి జగదీశ్ రెడ్డి, ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, స్థానిక ఎమ్మెల్యే రవీంద్రకుమార్ లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి దవాఖానను పరిశీలించారు. రోగులకు మెరుగైన సేవలు అందించాలని వైద్యులకు, దవాఖాన సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.