వలిగొండ: మండలంలోని వెంకటాపురం గ్రామ పరిధి మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం కొండపై జడ్పీటీసీ వాకిటి పద్మా అనంతరెడ్డి సౌజన్యంతో నిత్యాన్నదాన సత్రంలో సోమవారం భక్తులకు అన్నదానం నిర్వహించి మొక్కు చెల్లించుకున్నారు.
కార్యక్రమంలో కందాల రామ కృష్ణారెడ్డి, సుక్క ముత్యాలు, బుర్ర నర్సింహ, కసరబోయిన లింగయ్య, సుర్కంటి నాగార్జున్రెడ్డి, జగన్, మధు, వెంకట్, భక్తులు, అర్చకులు పాల్గొన్నారు.