మాల్: కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ పథకాలు పేదలకు వరమని ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. శని వారం చింతపల్లి తహసీల్దార్ కార్యాలయం వద్ద మండలం లోని 36మందికి కల్యాణ లక్ష్మీ, షాదీముబారక్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు పేదింటి ఆడబిడ్డలకు కొండంత భరోసా ఇస్తుందన్నారు.
ప్రతి పేదింటి ఆడ బిడ్డకు పెళ్లి కానుకగా రూ.100116లు అందింస్తున్నది తెలంగాణ ప్రభుత్వం మాత్రమేనని అన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల వల్ల బాల్య విహాలు తగ్గాయన్నారు. దీంతోపాటు రైతులకు, కుల వృత్తులకు అవసరమైన పథకాలను అమలు చేసి వారి జీవితాలను నిలపెట్టిన ఘనత ఒక్క కేసీఆర్కే దక్కిందన్నారు.