మాడ్గులపల్లి: పేద ఆడబిడ్లల పెండ్లిలకు ప్రభుత్వం అందజేస్తున్న తాంబూలమే కల్యాణలక్ష్మి, షాదీ ముభారక్లని నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ అన్నారు. గురువారం మండలంలోని కన్నెకల్ గ్రామంలో 29 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముభారక్ చెక్కులు పంపిణీ చేశారు.
ఈ సందర్భంంగా ఎమ్మెల్యే కల్యాణలక్ష్మి, షాదీముభారక్లతో పేదల కుంటుంబాల్లో వెలుగులు నిండాయన్నారు. అనంత రం ధర్మాపురం, గారకుంట పాలెం, గజలాపురం గ్రామాల్లో ఓవర్ హెడ్ ట్యాంకులకు శంకుస్థాపనలు చేశారు. పనులు పూర్తి కాగానే ప్రతి ఇంటికి మిషన్ భగీరథ నీరు అందుతుందన్నారు. అనంతరం మాచనపల్లి గ్రామంలో తాగునీటి సమస్య పై గ్రామంలో పర్యటించి అధికారులతో సమస్యపై చర్చించారు.
వారం రోజ్లులో ప్రతి ఇంటికీ తాగు నీరు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారు లను ఆదేశించారు. కార్యక్రమంలో సర్పం చ్ కాటేపల్లి సరిత, కుక్కమూడి చామంతి, జిల్లా, మండల కోఆప్సన్ సభ్యులు మోషన్ అలీ, మౌలాలి, టీఆర్ఎస్ మండ లాధ్యక్షుడు బాబయ్య, యూత్ అధ్యక్షుడు అర్జున్ రెడ్డి, తహసీల్దార్ అర్చన, ఆర్డబ్లూఎస్ డీఈ సంపత్ పాల్గొన్నారు.