మాడ్గులపల్లి: తెలంగాణ ప్రభుత్వం ప్రతి మండలంలో ఏర్పాటు చేస్తున్న బృహత్ పల్లెప్రకృతి వనాల పనులను వేగంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ జీవన్ పాటిల్ అధికారులను ఆదేశించారు. సోమవారం మండల కేంద్రంలోని బృహత్ పల్లె ప్రకృతి వనాన్ని జిల్లా పంచాయతీ అధికారి విష్ణువర్ధన్తో కలిసి ఆయన పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మాడ్గులపల్లి మండలంలో 10ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్న ప్రకృతి వనంలో 31వేల మొక్కలు నాటాలన్నారు. ఇప్పటికే 28వేల మొక్కలు నాటారని మిగిలిన మొక్కలు కూడా నాటి ప్రకృతి వనం చుట్టూ కంచె ఏర్పాటు చేయాలన్నారు.
గేటు దిమ్మలు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. రహదారుల వెంట ఎవెన్యూ ప్లాంటేషన్ చేసి మొక్కలను సంరక్షించాలన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ పుల్లెంల సైదులు, సర్పంచ్ శోభ, ఎంపీడీవో జితేందర్రెడ్డి పాల్గొన్నారు.
పర్యావరణాన్ని పరిరక్షించాలి
వేములపల్లి: ప్రభుత్వం నిర్ధేశించిన లక్ష్యం మేరకు బృహత్ పల్లె ప్రకతి వనాలలో మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షిం చి పచ్చదనాన్ని పెంపొందించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. సోమవారం మం డల పరిధిలోని సల్కునూరు గ్రామంలోని పల్లె ప్రకతి వనాన్ని ఆయన అధికారులతో కలిసి పరిశీలించారు. పెండింగ్లో ఉన్న పనులను వారంలో పూర్తి చేయాలని తెలిపారు. ఆయన వెంట విష్ణువర్ధన్, మండల అధికారులు ఉన్నారు.
వారంలోపు పనులు పూర్తి చేయాలి
తిప్పర్తి: బృహత్ పల్లె ప్రకృతి వనం పనులు వారం రోజుల లోపు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అధికారులను ఆదేశించారు. సొమవారం మండంలోని పజ్జూరులో ఏర్పాటు చేసిన బృహత్ పల్లె ప్రకృతి వనాన్ని సందర్శిం చి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం నిర్ధేశించిన లక్ష్యం మేరకు బృహత్ పల్లె ప్రకృతి వనాలలో మొక్కలను నాటి పచ్చదనం సంతరించుకునేలా చర్యలు చేపట్టాలన్నారు.
బృహత్ పలె ్లప్రకృతి వనాలు ప్రతి మండలానికి ఒక్కటి చొప్పున ఏర్పాటు చేయడం జరిగిందని, ఈత వనాల కొరకు ఉపాధిహామీ నిధులు రూ.40లక్షలతో ఏర్పా టు చేయనున్నట్లు తెలిపారు. అనంతరం డంపింగ్ యార్డు, వైకుంఠ ధామా లను పరిశీలించారు. వాటి చుట్టూ కూడా ఫినిషింగ్ ఏర్పాటు చేసి మొక్కలను నాటాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో డీపీవో విష్ణువర్ధన్రెడ్డి, ఎంపీడీవో మహేందర్రెడ్డి, స్థానిక సర్పంచ్ ఎస్కే మోయిజ్, ఎంపీవో సంగీత, ఈసీ జుల్ఫేకర్ అలీ, కార్యదర్శి అనీల్, కో ఆప్షన్ రాగి మురళి, మాజీ సర్పంచ్ మాతంగి జానయ్య తదితరులు ఉన్నారు.