నల్లగొండ : ఉదయం సముద్రం ఎత్తిపోతల పథకం కెనాల్స్కు భూసేకరణ త్వరగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్(రెవెన్యూ) వి.చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో నిర్మిస్తున్న ఉదయం సముద్రం ఎత్తిపోతల పథకం హెడ్ వర్క్స్, భూ సేకరణ పూర్తి చేసినట్లు, కెనాల్స్ తవ్వకానికి సంబంధించి భూ సేకరణ త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
ఇప్పటి వరకు 3851 ఏకరాలకు గాను 1486 ఎకరాలు భూ సేకరణ పూర్తి చేసినట్లు, ఇంకా 900 ఎకరాలకు రిక్విజిషన్ కు ప్రతి పాదనలు సమర్పించ నున్నట్లు ఏ.యం.ఆర్.పి. ఈఈ బుచ్చిరెడ్డి తెలిపారు. జిల్లాలో లక్ష ఎకరాల ఆయకట్టుకు సాగు నీరు అందించే ఈ పథకం సంబంధించి నల్గొండ, నార్కట్ పల్లి, చిట్యాల, కట్టంగూర్, మునుగోడు మండలంల లో భూ సేకరణకు, రెవెన్యూ, అటవీ, ఏ.యం.ఆర్.పి., ఆర్&బి అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు.
సర్వే, అవార్డ్ పాస్ చేసి భూ సేకరణ చేసిన రైతులకు నష్ట పరిహారం చెల్లింపు వేగవంతం చేయాలని, భూ సేకరణ త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. సమావేశంలో నల్గొండ డి.ఆర్.ఓ. జగదీశ్వర్ రెడ్డి, ఆర్ అండ్ బీ ఈఈ నరేందర్, ఏ.యం.ఆర్.పి. ఈఈబుచ్చిరెడ్డి, తహసిల్దారులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.