హాలియా: కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం రూపోందించి అమలు చేస్తున్న నూతన వ్యవసాయ, విద్యుత్ సంస్కరణల ను వెంటనే పునర్ సమీక్షించి రద్దు చేయాలని నాగా ర్జునసాగర్ నియోజకవర్గ శాసనసభ్యుడు నోముల భగత్ డిమాండ్ చేశారు. సినీ నటుడు ఆర్. నారాయణ మూర్తితో కలసి బుధవారం హాలియా క్యాంపు కార్యాలయంలో ఎమ్మె ల్యే నోముల భగత్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజహితం కోసమే నారాయణ మూర్తి రైతు ఇతివృత్తంతో రైతన్న సినిమా తీశారని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతాంగమంతా ఈ సినిమాను ప్రతి ఒక్కరూ చూడాలని కోరారు.
రైతు సంక్షేమమే ధ్యేమంగా ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన రైతుబంధు, రైతుబీమా, ఉచిత విద్యుత్ చట్టాలు దేశవ్యాప్తంగా ప్రశంసించ బడుతున్నాయన్నారు. అనంతరం నారాయణమూర్తి మాట్లాడుతూ రైతు సమస్యల ఇతివృత్తంగా ఈ సినిమా తీశారన్నారు. రైతులంతా తప్పక చూడాలని కోరారు. కాగా ఈ సందర్భంగా నారాయణ మూర్తి రైతన్న సినిమా చూడా లని ఎమ్మెల్యే నోముల భగత్ను కోరగా ఈ నెల 6న నియోజకవర్గ రైతులతో కలసి సినిమా చూడనున్నట్లు తెలిపారు.
సమావేశంలో అనుముల, తిరుమలగిరి, సాగర్ టీఆర్ ఎస్ మండలాధ్యక్షులు కురాకుల వెంకటేశ్వర్లు, పిడిగం నాగయ్య, హాలియా మున్సిపల్ చైర్పర్సన్ గౌరవ సలహదారుడు వెంపటి శంకరయ్య, వైస్ చైర్మన్ నల్లగొండ సుధాకర్, వార్డు కౌన్సి లర్లు నల్లబోతు వెంకటయ్య, కోఆప్షన్ సభ్యులు రావుల లింగయ్య, అన్వరుద్దీన్, టీఆర్ఎస్వీ నియోజకవర్గ ఇన్చార్జి పిల్లి అభినయ్, నాయకులు సురభి రాంబాబు, బందిలి సైదులు తదితరులు పాల్గొన్నారు.