టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవీందర్రావు, ఎమ్మెల్యే చిరుమర్తి
నార్కట్పల్లి : టీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు 2న టీఆర్ఎస్ జెండా పండుగను ఘనంగా నిర్వహించాలని టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తక్కళ్లపల్లి రవీందర్రావు, ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పిలుపునిచ్చా రు. నార్కట్పల్లి మండల కేంద్రంలో నార్కట్పల్లి, కట్టంగూరు మండలాల టీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రతిఒక్కరికీ అవగాహన కల్పించాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందన్నారు. తెలంగాణ ప్రజలకు గులాబీ జెండా తప్ప మరో జెండా అవసరం లేదనే విషయాన్ని స్పష్టం చేయాలన్నారు. సమావేశంలో ఎంపీపీ సూదిరెడ్డి నరేందర్రెడ్డి, మాజీ ఎంపీపీ రేగట్టె మల్లికార్జున్రెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీలు, మండల పార్టీ అధ్యక్షులు, పట్టణ పార్టీ అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు.