హాలియా: గ్రామ స్థాయి నుంచి టీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేయడం కోసం సంస్థాగత నిర్మాణం చేపట్టడం జరిగిందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, నాగార్జునసాగర్ నియోజకవర్గ సంస్థాగత ఎన్నికల ఇన్చార్జి చాడా కిషన్రెడ్డి అన్నారు. మంగళ వారం హాలియాలో ఎమ్మెల్యే నోముల భగత్తో కలిసి క్యాంపు కార్యాలయంలో పార్టీ ముఖ్యలతో ఆయన సమావేశం నిర్వ హించారు. అనంతరం ఎమ్మెల్యే నోముల భగత్తో కలసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు ఈ నెల 2న నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో జెండా పండుగ నిర్వహించడం జరిగిందన్నారు.
పార్టీ ఆదేశాల మేరకు వారం రోజులుగా నియోజకవర్గంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో గ్రామ కమిటీలను వేయడం జరి గిందన్నారు. పార్టీ సంస్థాగత నిర్మాణంలో నాగార్జునసాగర్ రాష్ట్రంలో ఫస్ట్ ఉందన్నారు. త్రిపురారం మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో గ్రామ కమిటీలు పూర్తి కాగా నియోజకవర్గంలో ఇప్పటివరకు 80శాతం గ్రామాల్లో గ్రామ కమిటీలు వేయడం జరిగందన్నారు. బుధవారంతో నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో గ్రామ కమిటీలు పూర్తవుతుందని ఈ నెల 9న నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో నూతన గ్రామ కమిటీ బాధ్యులతో ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు.
ఎమ్మెల్యే నోముల భగత్ మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని సంక్షేమ కార్యక్రమాలు మన రాష్ట్రంలో అమలు చేయడం జరుగుతుందన్నారు. రైతుబంధు, రైతుబీమా, ఉచిత విద్యుత్, కల్యాణ లక్ష్మి, షాదీముభారక్, దళితబంధు వంటి పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. సీఎం కేసీఆర్ చేపట్టిన ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని ప్రజలకు చేరవేసేందుకు పార్టీ బాధ్యులు కృషి చేయాలని కోరారు.
దేశంలో 60లక్షల మంది పార్టీ సభ్యత్వం కలిగిన ఎకైక ప్రాంతీయ పార్టీ టీఆర్ఎస్ పార్టీనేనని అన్నారు. సమావేశంలో జడ్పీ వైస్ చైర్మన్ ఇరిగి పెద్దులు, టీఆర్ఎస్ జిల్లా నాయకుడు మల్గిరెడ్డి లింగారెడ్డి, వెంపటి శంకరయ్య, నల్లగొండ సుధాక ర్. మండలాధ్యక్షుడు కురాకుల వెంకటేశ్వర్లు, తాటి సత్యపాల్, బోల్లం రవి, వర్రా వెంకట్రెడ్డి, చెరుపల్లి ముత్యాలు, సురభి రాంబాబు, దోరేపల్లి వెంకటయ్య, బందిలి సైదులు, మీసాల ఆంజనేయులు, రావుల లింగయ్య, టీఆర్ఎస్వీ నియోజకవర్గ ఇన్చార్జి పిల్లి అభినయ్ తదితరులు పాల్గొన్నారు.