హాలియా: సీఎంఆర్ఎఫ్ పేదలకు వరమని నాగార్జునసాగర్ నియోజకవర్గ శాసనసభ్యుడు నోముల భగత్ అన్నారు. మంగళవారం తిరుమలగిరి సాగర్ మండలం శిల్గాపురం గ్రామానికి చెందిన శంకరయ్యకు రూ.36 వేల సీఎంర్ఎఫ్ చెక్కును అందజేశారు.
కార్యక్రమంలో సర్పంచ్ తుడుం రమణ ముత్తయ్య, ఉప సర్పంచ్ బేబీ, కట్టెబోయిన అనీల్కుమార్ యాదవ్, కోటయ్య, బుర్రి సందీప్, బోల్లం రవి తదితరులు పాల్గొన్నారు.