హాలియా: ప్రజా సంక్షేమం, రాష్ర్టాభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించ డంతో పాటు టీఆర్ఎస్ పార్టీ బలోపేతం కోసం హాలియా మున్సిపాలిటీ నూతన కార్యవర్గ సభ్యలు, పార్టీ నాయకులు కృషి చేయాలని నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ కోరారు.
సోమవారం హాలియా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో హాలియా మున్సిపాలిటీలో నూతనంగా ఎన్నికైన వార్డు కమిటీ స భ్యులు, పార్టీ నాయకులు, మున్సిపల్ చైర్మన్, కౌన్సిల ర్స్తో విసృత స్ధాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హాలియా మున్సిపాలిటీ అధ్యక్షుడిగా చెరుపల్లి ముత్యాలు, ప్రధాన కార్యదర్శిగా దోరేపల్లి వెంకన్న, యూత్ అధ్యక్షుడిగా కురాకుల రవి, ఫ్రధాన కార్యదర్శిగా కొండేటి అశోక్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయాల్సిన బాధ్యత పార్టీ నాయకులకుపై ఉందన్నారు. దేశంలో ఎక్కడాలేని సంక్షేమ పథకాలు మన రాష్ట్రంలో అమలు చేయడం జరుగుతుందన్నారు. అదేవిధo గా హాలీయా మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రభుత్వం ఇటీవల రూ.15 కోట్లను విడుదల చేసిన సంగతి మన అందరికి తెలిసిందేనన్నారు.
సమావేశంలో నాయకులు వెంకటి శంకరయ్య, యడవల్లి మహేందర్రెడ్డి, మల్గిరెడ్డి లింగారెడ్డి, వైస్ చైర్మన్ నల్లగొండ సుధాకర్, కౌన్సిలర్లు వర్రా వెంకట్రెడ్డి, నల్లబోతు వెంకటయ్య, అన్నేపాక శ్రీను, ప్రసాద్ నాయక్, కోఆప్షన్ సభ్యులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.