నల్లగొండ : వివిధ అనారోగ్య కారణాలతో వివిధ ప్రైవేట్ హాస్పిటల్స్ లో చికిత్స చేయించుకున్న లబ్ధిదారులకు మాజీ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేశారు. ఆదివారం నల్లగొండలోని తన క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరు అయిన రూ.22,98,500 విలుగల చెక్కులను లబ్ధిదారులకు అందజేసి మాట్లాడారు.
పేదలకు కష్టకాలంలో సీఎంఆర్ఎఫ్ ఎంతో ఉపయోగ పడుతుందన్నారు. నిరు పేదలు దీనిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, తదితరులు ఉన్నారు.