తిరుమలగిరి సాగర్: గ్రామాల్లో టీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోము ల భగత్కుమార్ అన్నారు. ఆదివారం మండలంలోని తెట్టెకుంట, అల్వాల, శ్రీరాంపురం, పెదబావితండా, తూటిపేట తం డా, రంగుండ్ల, శిల్గాపురం గ్రామాల్లో టీఆర్ఎస్ గ్రామ కమిటీ ఎన్నికలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏ రాష్ట్రంలో జరగని అభివృద్ధి తెలంగాణలో జరుగుతున్నదన్నారు.
దేశ ప్రజలు గర్వించేలా తెలంగాణను అభివృద్ధి పథంలో నడుపుతున్న ఏకైక ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు అని అన్నారు. దేశం ఆశ్చర్యపోయేలా రైతుబంధును ప్రవేశపెట్టి అన్ని వర్గాలకు సమన్యాయంతో కృషి చేస్తున్నట్లు తెలిపారు.
కార్యక్రమంలో ఎంపీపీ ఆంగోతు భగవాన్ నాయక్, జడ్పీటీసీ సూర్య, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పిడిగం నాగయ్య, సర్పంచ్ జయరాం, ఎంపీటీసీ పుట్లూరు రాజశేఖర్ రెడ్డి, పీఏసీఎస్ వైస్ చైర్మన్ గజ్జెల శ్రీనివాసరెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గుండాల రవి, ఎక్కలూరి శ్రీనివాసరెడ్డి, అనీల్ కుమార్, సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు బూడిద హరికృష్ణ, పెద్దిరాజు, మోతీరాం, మంగ్యా, భాష్య, మల్లిఖార్జున, పంతు పాల్గొన్నారు.