నల్లగొండ: జిల్లాలోని చింతపల్లి మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని కుర్మెడ్ గేట్ వద్ద కారు, జేసీబీ ఢీకొన్నాయి. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతులను మండలంలోని హోమంతాల పల్లికి చెందిన తండ్రీ కూతుర్లు.. వలమల రమేష్ (30), అక్షర(2)గా గుర్తించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్తుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.