11సీపీల్30: రామన్నపేట… సిరిపురంలో వైకుంఠదామంను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
11సీపీల్30ఏ: రామన్నపేట.. సిరిపురం గ్రామంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
11సీపీల్ 30బి: రామన్నపేట… సిరిపురం గ్రామంలో టీఆర్ఎస్ కండువాకప్పి పార్టీలోకి ఆహ్వానిస్తున్న ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
రామన్నపేట: కేసీఆర్ ప్రభుత్వం ప్రతి పథకాన్ని ప్రజల సంక్షేమం కోసమే అమలు చేస్తున్నదని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. సోమవారం మండలంలోని సిరిపురం గ్రామంలో సుమారు రూ. 30లక్షలతో నిర్మించిన పల్లెప్రగతి పనులను, 35 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైన్లను ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ… దర్మారెడ్డి కాలువ ఆధునీకరణ పనులను పూర్తి చేయించి మూసీతో పాటు గోదావరి జలాలు అందించడం జరుగుతుందన్నారు.
పంటల దిగుబడిలో తెలంగాణ రాష్ట్రం అగ్ర స్థానంలో నిలిచిందన్నారు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా పేద, దళిత విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు 12వందల గురుకులాలను ఏర్పాటు చేసిందనన్నారు. 17వేల కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా రైతు బంధు పథకంను అమలు చేస్తుందన్నారు. పల్లె ప్రగతి ద్వారా గ్రామా లన్నీ అభివృద్ధి పథంలో ఉన్నాయన్నారు. కేంద్రలోని బీజేపీ ప్రభుత్వం పెట్రోల్, గ్యాస్, డీజిల్ ధరలు పెంచి ప్రజలపై మోయలేని భారాన్ని మోపుతుందని అన్నారు.
కేసీఆర్ సంక్షేమ పథకాలతో ప్రతిపక్ష పార్టీలు కనుమరుగైయ్యాయన్నారు. రేవంత్రెడ్డి తెలుగుదేశాన్ని ఖతం పెట్టించి కాంగ్రెస్ పార్టీ టికెట్లు అమ్ముకు నేందుకు పార్టీలో చేరాడని ఎద్దేవా చేశారు. గ్రామంలో అంగన్వాడీ భవనం, ప్రధాన రోడ్డుమీద అండర్గ్రౌండ్ నిర్మాణాలకు నిధులు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు.
సర్పంచ్ అప్పం లక్ష్మినర్సు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎంపీపీ కన్నెబోయిన జ్యోతిబలరాం, జడ్పీటీసీ పున్న లక్ష్మి జగన్మోహన్, సింగిల్ విండో చైర్మెన్ నంద్యాల భిక్షంరెడ్డి, తహాసీల్దార్ ఆంజనేయులు, ఎంపీడీవో జలేందర్రెడ్డి, సర్పంచ్ లు గుత్తా నర్సింహారెడ్డి, ఎడ్ల మహేందర్రెడ్డి, ఉప్పు ప్రకాశ్, ఎంపీటీసీలు బడుగు రమేశ్, గొరిగే నర్సింహా, నాయకులు మందడి రవిందర్రెడ్డి, అంతటి రమేశ్, మందడి శ్రీధర్రెడ్డి, పున్న వెంకటేశం, బద్దుల రమేశ్, ఉపసర్పంచ్ శ్రవణ్ కుమార్ రెడ్డి, మండల కార్యదర్శి పోచబోయిన మల్లేశం, గ్రామాధ్యక్షుడు బండ శ్రీనివాస్రెడ్డి, బీసీ సంఘం మండలాధ్యక్షుడు కూ నూరు ముత్తయ్య, యువజన సంఘం అధ్యక్షుడు బత్తుల వెంకటేశ్, వార్డు సభ్యులు అక్షిత, పున్న శేఖర్ పాల్గొన్నారు.
టీఆర్ఎస్ పార్టీలో చేరిక…
మండలంలోని సిరిపురం గ్రామంలో స్థానిక వార్డు సభ్యుడు పోలేపాక పద్మకృష్ణ, ఆనగంటి సైదులు, బొడ్డుపల్లి శంకర్తో పాటు వివిధ పార్టీలకు చెందిన 50 మంది నాయకులు నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. వీరికి ఎమ్మెల్యే పార్టీ కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.