దేవరకొండ: రాష్ర్టంలోఅనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తూ అన్ని రంగాల్లో ముందంజలో నిలిపిన పితామహుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. బుధవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో చందంపేట మండలానికి చెందిన 44 మంది లబ్ధిదారులకు రూ.44 లక్షల విలువైన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కల్యాణలక్ష్మి, షాదీ మూబారక్ పేద ప్రజలకు అండగా ఉంటుందని ఎమ్మెల్యే తెలిపారు. కరోనా సమయంలోనూ సంక్షేమ పథకాలు అందించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్దే అని ఆయన గుర్తు చేశారు.
కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ శిరందాసు లక్ష్మమ్మ, సర్పంచ్ దొందెటి మల్లా రెడ్డి, రమావత్ మోహన్కృష్ణ, గొసుల ఆనంతగిరి, యాసాని రాజవర్ధన్రెడ్డి, బోయపల్లి శ్రీనివాస్గౌడ్, జక్కుల మున్నయ్య, బడ్డుపల్లి కృష్ణ, సయ్యద్ శ్రీను తదితరులు పాల్గొన్నారు.